NewsInn

News in a Click

ఛత్తీస్ ఘడ్ సీఎం తో మంత్రి ఉత్తమ్ భేటి

ఛత్తీస్ ఘడ్ సీఎం తో మంత్రి ఉత్తమ్ భేటి

(హైదరాబాద్,న్యూస్ఇన్)

చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ను మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారుల బృందంతో పార్క్ హయత్ లో చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తో సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చత్తీస్ ఘడ్-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో నిర్మిస్తున్న సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పధకం పై సుధీర్ఘంగా సమీక్షించారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి NOC ఇవ్వాలంటూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.

సమ్మక్క- సారక్క ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వండి…

తెలంగాణ–చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల మధ్య సమన్వయంతో ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ వేగవంతానికి ప్రభుత్వం చర్యలు.

సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి అవసరమైన NOC మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి.

ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి భద్రత కల్పించడంలో సమ్మక్క-సారక్క ప్రాజెక్టు కీలకం.

వేలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

అంతర్రాష్ట్ర అంశాల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం దౌత్యపరమైన చొరవ.

ప్రాజెక్టు అనుమతుల విష యంలో సానుకూల స్పందన ఇవ్వాలని చత్తీస్‌ఘడ్ ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ.

రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *