NewsInn

News in a Click

ఎంబీబీఎస్ విద్యార్థులకు KCR చెక్కులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వారి వైద్య విద్యకు అయ్యే ఫీజును బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారి చేతుల మీదుగా చెక్కుల రూపంలో అందజేశారు.ఆదివారం నందిన‌గ‌ర్ నివాసంలో మెడిసిన్ విద్యార్థుల‌కు ఆర్ధిక స‌హాయం చేశారు. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పేద‌ విద్యార్థులు వైద్య విద్య‌లో సీటు సాధిస్తే…వారికి ఫీజు చెల్లించ‌డం గ‌త కొన్నేల్లుగా ఎమ్మెల్యే బండారి ల‌క్ష్మారెడ్డి అంద చేస్తున్నారు. అందులో భాగంగానే 15 మంది విద్యార్థుల‌కు కేసిఆర్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేశారు.

చాద‌ర్ స‌మ‌ర్పణ‌…..

అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రతీయేటా పార్టీ తరఫున చాదర్ సమర్పించినట్టుగానే, ఈ సంవత్సరము కూడా అదే సంప్రదాయాన్ని బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ కొనసాగించారు. ప‌లువురు మైనార్టీ నేత‌ల‌తో క‌లిసి తెలంగానా భ‌వ‌న్ లో చాద‌ర్ స‌మ‌ర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *