NewsInn

News in a Click

ఆ గ్రామంలో పెళ్లి కాకుండా మ‌ధ్యం తాగితే…!

ఆ గ్రామంలో పెళ్లి కాకుండా మ‌ధ్యం తాగితే…!

(న్యూస్ఇన్‌,చెన్నై)

మ‌ధ్య పాన నిషేధం పూర్తి స్థాయిలో అమ‌లు చేయ‌డం దాదాపు అసాధ్యం అన్న అభిప్రాయంతో ఓ గ్రామ‌స్తులు వినూత్న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మిళ నాడులోని స‌ముద్ర తీర గ్రామ‌మైన విలుండ‌మావ‌డి మ‌త్స్య కార సంఘం యువ‌తను మధ్యం సేవించ‌కుండా త‌మ ప‌రిధిలోనైనా చ‌ర్య‌లు మొద‌లు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. మ‌ధ్య పాన నిషేధం అనే పేరు లేకుండానే గ్రామంలో క‌ఠినంగా నిర్ణ‌యాలు అమ‌లు చేయాల‌ని గ్రామ పెద్ద‌లు తీర్మానం చేశారు. ప్ర‌ధానంగా యువ‌త పెళ్లికి ముందే మ‌ద్యం సేవించ‌డం అలవాటు చేసుకుని విప‌రీత పోక‌డ‌ల‌తోకొత్త ఇబ్బందులు సృష్టిస్తున్నార‌న్న అభ‌ప్రాయంతో యువ‌త‌పై ప్ర‌త్యేకంగా ఆంక్షలు విధించారు. గ్రామంలోపెళ్లి కాని యువకులు మ‌ధ్యం తాగుతూ పట్టుబడితే రూ.5వేలు జరిమానా వేయాల‌ని గ్రామ పెద్ద‌లు నిర్ణ‌యించారు. మ‌ధ్యం సేవిస్తున్నార‌న్న సమాచారం ఇచ్చిన వారికి రూ.2వేలు నగదు బహుమతి ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. వత భవిష్యత్, గ్రామ సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెళ్లెన పురుషులు మద్యం సేవించవచ్చని,అయితే తాగి గొడవ పడితే అలాంటి వారిపైనే రూ.5వేలు జ‌రిమానా విధించాల‌ని గ్రామంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యంతో నైనా యువ‌త‌కు మ‌ద్యం అల‌వాటుకు బ్రేకులు వేయాల‌ని గ్రామ‌స్తులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *