(హైదరాబాద్, న్యూస్ఇన్)
హైదరాబాద్ నగరంలో తన పేరుతో ఓ ప్రధాన రహదారికి నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టడంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు.

శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో “భారతదేశంలోని హైదరాబాద్లో కొత్తగా ‘డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ను ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవించబడిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే. ధన్యవాదాలు! – ప్రెసిడెంట్ డోనాల్డ్ జే. ట్రంప్” అని సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నానక్రామ్గూడలోని యూఎస్ కాన్సులేట్ లో ఈనెల 23న జరిగిన అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ రహదారి నామఫలకాన్ని
అమెరికా రాయబారి సెర్జియో గోర్, హైదరాబాద్లోని యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ల సమక్షంలో లాంఛనంగా ఆవిష్కరించారు.












Leave a Reply