(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మూడు రోజుల పర్యటన ఆదివారం నుంచి జరుగనుంది. పార్టీ కార్యక్రమాల్లో మూడు రోజుల నితిన్ బీజీగా గడుపనున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో తొలిసారి తెలంగాణాలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నబిన్…రెండో సారి మూడు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వస్తుండడంతో బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ కు రానున్న నితిన్ నబిన్ కు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ సమీపంలోని ఊట్ వల్లి గ్రామంలో రంగారెడ్డి జిల్లాతో పాటు మరో 9 జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ పార్టీ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాంచందర్ రావ్ సహా పలువురు నేతలు శనివారం పరిశీలించారు.

సోమవారం ఉదయం 10 గంటలకు ఘట్ కేసర్ సమీపంలో విజ్ఙాన్ భారతి కళాశాలలో ఏర్పాటు చేసే యూత్ కాంక్లేవ్ లో పాల్గొంటారు. అనంతరం వరంగ్ జిల్లా పర్యటనకు నితిన్ నబిన్ వెళ్తారు. వరంగల్ భద్రకాలి దేవాయాన్ని అదే రోజు మధ్యాహ్నం సందర్శించుకుని ఆ తరువాత గిరిజన సంఘాల నేతలతో సమావేశం అవుతారు. సాయంత్రం వరంగల్ లో వరంగల్ జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షులు హాజరయ్యే సభలో నితిన్ నబిన్ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మంగళవారం ఘట్ కేసర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించి పాల్గొంటారు.












Leave a Reply