(హైదరాబాద్,న్యూస్ ఇన్)
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తొలిసారి ఒకేసారి ఒక్క పేషెంట్కు 5 అవయవాలను విజయవంతంగా (మల్టీ-విసెరల్) ట్రాన్స్ప్లాంట్ చేశారు. 36గంటల పాటు జరగిన ఈ ఆపరేషన్ రోగికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఒక్కో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకే లక్షల రూపాయలు ప్రైవేటు ఆపుపత్రలు దండుకుంటున్న ఈ రోజుల్లో ఉస్మానియలో ఈ ఆసుపత్రిని ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి చరిత్ర సృష్టించారు. కడుపు (Stomach), డ్యూడినమ్ (duodenum) ప్యాంక్రియాస్ (Pancreas), చిన్నపేగు (small bowel), పెద్దపేగు(Rt colon) అవయవాలను ఒకేసారి రోగికి మార్పిడి చేశారు. క్లిష్టమైన ఈ శస్త్రచికిత్స 36 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్కు ఈ అరుదైన శస్త్రచికిత్స ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఉస్మానియా వైద్య బృందం సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను మరింత పెంచిందని మంత్రి పేర్కొన్నారు.












Leave a Reply