(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణం చేసిన అయోధ్య రామాలయంలో దొంగలు పడితే బీజేపీ నేతలు ఎందుకు సైలెంట్ ఉంటున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. దేవాలయం నిర్మించి క్రెడిట్ దక్కించుకున్నమోడీ, షాలు ఇప్పుడు మౌనంగా ఉండడం దేనికి సంకేతమన్నారు. భక్తులు ఎంతో భక్తితో హుండీలో కానుకలు వేస్తే వాటిని మాయం చేస్తున్న ఘనత బీజేపీ నేతలకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రామాలయం ఘటనపై ప్రదాని మోడీ కంటే ముందు రాహూల్ గాంధీ స్పందించిన విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు. దేవలయంలోనే చోరీ జరుగడంతో ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఈ ఘటనకు ఉత్తర్ ప్రదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. 40 ఏళ్లుగా రాముడి పేరుతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ దేవాలయ ఘటనపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. మేము దీనిపై రాజకీయం చేయడం లేదని ప్రజల తరపున ప్రశ్నిస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. అయోధ్య ఘటనపై దేశంలోని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నేతలపైనే ఉందన్నారు. తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకునే యత్నాలను బీజేపీ చేస్తోందని ఆరోపించారు. కోట్లాది మంది భక్తులకు దేవుడిపై ఉన్ననమ్మకాన్న వమ్ము చేయరాదని బీజేపీ నేతలకు సూచించారు.

ఇక తెలంగాణా బీజేపీ నేతలకు ఇది చిన్నవిషయంగా కనిపించడం హస్యా స్పదంగా ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావ్ దీన్నిచిన్న విషయంగా ప్రస్తావించడం ప్రజలు గమనించాలన్నారు. కేంద్రంలో, యూపీలో బీజేపీ అధికారంలో లేకపోతే ఆ పార్టీ నేతలు ఇలాగే లైట్ గా తీసుకునే వారా అని ప్రశ్నించారు. దేశ ప్రజలకు ప్రధాని మోడీ, అమీత్ షాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.












Leave a Reply