(మెదక్,న్యూస్ఇన్)
రాజకీయంగా నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేసినా…తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీల చావును బీఆర్ ఎస్ కోరుకుంటుందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు బట్టారు. మాట ఇస్తే నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ అయితే…మాట ఇచ్చి మోసం చేసేది బీఆర్ ఎస్ పార్టీ అని జగ్గారెడ్డి ఆరోపించారు. సరూర్ నగర్ లో నిరుద్యోగ డిక్లరేషన్ ను డెత్ డిక్లరేషన్ అంటూ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. సోనియా గాంధీ దయతో తెలంగాణా రాష్ట్రం వచ్చిందని, 10 ఏళ్లు రాజభోగాలు అనుభవించి ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగానా ప్రకటించిన తరువాత కేసీఆర్ తన కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతి కేటిఆర్ మార్చి పోయారా అంటూ చురుకలు అంటించారు. ప్రత్యేక తెలంగాణా ఇచ్చిన కుటుంబం నాషనం కోరుకోవడం తెలంగాణా సంస్కృతా అని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబానిది అయితే……విలువలు లేని రాజకీయాలు కేసీఆర్ కుటుంబానివి అని ఆరోపించారు.












Leave a Reply