(మెదక్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేయడంతో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై చేరుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జగ్గారెడ్డి నిరసనతో జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో, పోలీసులు జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై టెన్షన్ వాతావరణం నెలకొంది. జగ్గారెడ్డిని తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు చుట్టుముట్టి అడ్డుకున్నారు. కార్యకర్తలను అడ్డు తొలగించి పోలీసులు జగ్గారెడ్డిని అక్కడి నుంచి తప్పించారు.













Leave a Reply