(హైదరాబాద్,న్యూస్ఇన్)
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడంతో ఆ వత్తిడిలోనే ఆయన గుండెపోటుకు గురయ్యాడని బీఆర్ ఎస్ కొత్త వాదన తెరపైకి తెస్తోంది. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు సుదర్శన్ రెడ్డి ఆసుపత్రిలో చేరిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడితే ఇది తనకు తెలిసిందన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో పౌరసరఫరాల శాఖ చైర్మన్ గా ఉన్న సమయంలో ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్ కమిషనర్ గా ఉన్నారని గతంలో వేల కోట్ల కుంభ కోణాలు జరిగడంతో వాటికి ఆస్కారం లేకుండా జరిగేందుకు ప్రణాళికను అప్పటి సీఎం కేసీఆర్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇచ్చారన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లైస్లో రూ.1100 కోట్ల స్కాం జరిగిందని పెద్ది బయట పెట్టడంతో పాటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారన్నారు. విద్యా శాఖలో కూడా భారీ స్కాం జరిగిందని ఆధారాలతో సహా పెద్ది బయటపెట్టారన్నారు.ఈ కుంభకోణాలు బయట పెట్డడంతో అప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ఆయనను వేధించడం మొదలు పెట్టారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఆయన వెపన్ లైసన్స్ కూడా రద్దు చేశారని, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇబ్బందులకు గురి చేయడంతో పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారన్నారు.












Leave a Reply