(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీసు, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్ల శాఖలో 7 ,437 భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖలో సివిల్ విభాగంలో 148 ఎస్ ఐ పోస్టులతో పాటు 3,697 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో 1,052 కానిస్టేబుల్ పోస్టుల, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 1,424 పోస్టులను భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. అగ్నిమాపక దశలోంలో 39 ఫైర్ ఆఫీసర్ పోస్టులు, 751 ఫైర్ ఫైటర్ పోస్టులు భర్తీ కానున్నాయి.జైల్ల శాఖలో డిప్యూటీ జైలర్, వార్డర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

త్వరలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకునేందుకు తేదీలను తెలంగాణా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. దరఖాస్తు దారులను ముందుగా శారీరక, వైద్య పరీక్షలు పరిశీలించుకోవాలని అబ్యర్థులకు సూచించింది. ఎస్సీ, ఈ డబ్లూస్, బీసీ, లోకల్ అభ్యర్థులు తాజా ధృవ పత్రాలు సిద్ధం చేసుకోవాలని నియామక బోర్డు సూచించింది. దరఖాస్తులను కేవలం ఆన్ లైన్లోనే స్వీకరిస్తామని వెల్లడించింది. తెలంగాణా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను స్వీకరించనుంది.
20 వేలు భర్తీ చేయాలి….
ప్రభుత్వం కేవలం 7 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని బీఆర్ ఎస్ నేతలు తప్పు బడుతున్నారు. దాదాపు 20 వేల వరకు పోలీసు శాఖలో ఉద్యగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నా….కేవలం 7 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. మొత్తం ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.












Leave a Reply