(న్యూస్ఇన్,హైదరాబాద్)
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిపక్ష గులాబీ పార్టీలో హీట్ పెంచుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. గతంలో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు కొత్త అభ్యర్ధులు తమ పేరును పరిగణలోకి తీసుకోవాలని పార్టీ అద్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫాంహౌంస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవులకు గడువు దగ్గర పడుతోంది. వచ్చే మార్చిలో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి దివంగత ప్రధాని పీవి నరసింహారావు కూతురు వాణీదేవి గులాబీ పార్టీ తరుపున ప్రాతినిద్యం వహిస్తుండగా, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కొనసాగుతున్నారు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి గతంలో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ అభ్యర్ధి ఎనుగుల రాకేష్ రెడ్డికే బీఆర్ఎస్ మరోసారి అవకాశం ఇస్తుందనే చర్చ జరుగతోంది. పార్టీలో ముందు నుంచి ఉన్న వాసుదేవ రెడ్డి, సతీష్ రెడ్డిలు కూడా తమ పేరును పరిగణలోకి తీసుకోవాల్సిందిగా పార్టీ అధినేత కేసీఆర్ కు విజ్ఝప్తి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ వాణీదేవి ఆరోగ్య పరిస్ధితిని దృష్టిలొ ఉంచుకుని మరో అభ్యర్తిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా వాణీ దేవి మాత్రం తన కుమార్తెకు ఈ సారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఐఆర్ ఎస్ అధికారి ఉమానాథ్ తో పాటు మన్నే క్రిషాంక్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ అడుతున్నా అంత సీరియస్ గా లేనట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానంలో పోటీ చేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ గతంలో అవలంబించిన సెంటిమెంట్ రాజకీయాన్నే మళ్లీ పునరావృతం చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో పీవీ నరసింహారావు కుమార్తెను అనూహ్యంగా తెరమీదకు తీసుకొచ్చి కాంగ్రెస్, బీజేపీలకు బ్రేకులు వేసింది. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. బ్రాహ్మణ సామాజిక వర్గానికే టికెట్ కేటయించాలన్న అభిప్రాయంతో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇదే నిర్ణయాన్ని అమలు చేసినట్లయితే వాణిదేవి కూతురు గులాబీ పార్టీ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీసీ సామాజికవర్గానికి టికెట్ కేటాయించాల్సి వస్తే….ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి రేపుతోంది. ఉమానాథ్ పేరు తెరపైకి వచ్చినా…పార్టీలో ముందు నుంచి ఉన్న బీసీ నాయకులు కూడా పార్టీ అవకాశం ఇస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో పార్టీ అభ్యర్థులకు ఎంత వరకు సహకరిస్తుందా అనుమానాలు అభ్యర్థులను వెంటాడుతున్నాయి. పార్టీ ఆర్ధికంగా అండగా ఉంటామని హామీ ఇస్తే…పోటీ చేసేందుకు మరింత మంది నేతలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ త్వరలో ఈ రెండు స్థానాల పరిధిలోని జిల్లాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరమే అభ్యర్థుల ఎంపికపై పార్టీ ఫోకస్ చేసే అవకాశం ఉంది.












Leave a Reply