(మెదక్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై క్షుద్ర పూజలు చేసి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేవుడు తమవైపు ఉన్నన్ని రోజులు క్షుద్ర కుట్రలు ఫలించవని సీఎం అన్నారు. ప్రజలపై చేతబడులు చేయడం ఎంత వరకు సమంజమసి ప్రశ్నించారు. ప్రభుత్వం విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేని కొంత మంది అఘోరాలతో పూజలు, చేతబడులు చేయడం వంటి కార్యక్రమాలు మొదలు పెట్టారన్నారు. మాజీ మంత్రి హరీష్ రావ్ ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ ఇవే ఆరోపణలు చేస్తే ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం తప్పు బట్టారు.
రేషన్ కార్డు కాగితం కాదు…
రేషన్ కార్డు అంటే అది ఓ కాగితం మాత్రమే కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ…. పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తెచ్చిందని సీఎం అన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు తమ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్య పంపిణీని మొదలు పెట్టిందన్నారు. బీజేపీ,బీఆర్ ఎస్ ప్రభుత్వాలు పేదల ఆకలి గురించి ఏనాడైనా ఆలోచించాయా అని ప్రశ్నించారు. ఆ రెండు వేర్వేరు పార్టీలు మాత్రమే అని కానీ ఒక్కటే అని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని ప్రచారం చేశారని ప్రభుత్వం ఏర్పాటై 32 నెలలు అవుతుందని, ఎప్పుడైనా కరెంటు పోయిందా అని ప్రశ్నించారు.

కేసీఆర్ కు సవాల్….
రాష్ట్రంలో బీఆర్ ఎస్ హాయంలో జరిగిన మేలు, కాంగ్రెస్ హాయంలో జరుగుతున్న మేలుపై చర్చించేందుకు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో మరోసారి సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత తమకు దక్కుతుందన్నారు. 90 వేల కోట్ల రుపాయలు ధాన్యం కొనుగోలు రైతుల నుంచి తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.
ఆరు నెలలకు ఓ సారి ఉద్యోగాల భర్తీ…
రాష్ట్రంలో ఇక ఆరు నెలలకు ఒక సారి ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 72 వేల ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. కొంత మంది దుర్మార్గులు రాజకీయం కోసం నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని వారి బారిన పడవద్దని యువతకు సూచించారు.
జగ్గారెడ్డిని రాహూల్ చూసుకుంటారు……

సంగారెడ్డి నియోజకవర్గంలో తాను పోటీ చేయనని అంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురించి సీఎం రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రాహూల్ గాంధీ గీసిన గీతను జగ్గారెడ్డి ఏనాడు దాటలేదన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీ చేస్తారో లేదో రాహూల్ గాంధీ నిర్ణయిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహూల్ గాంధీ రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడన్నారు. జగ్గారెడ్డి లాంటి నేత సంగారెడ్డి ప్రజలకు దొరకడం అదృష్టం అన్నారు. ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి నాయకులు ఉండరన్నారు. 30 ఏళ్లుగా ఆయనతో తనకు స్నేహం ఉందని, తెలంగాణాలో జగ్గారెడ్డి లాంటి నాయుకుడు లేడని సీఎం వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో గెలిచి ఉంటే జగ్గారెడ్డి మంచి స్థానంలో ఉండేవారని, అయినా….. ప్రజల మధ్యనే జగ్గారెడ్డి ఉంటున్నారన్నారు.
.
.












Leave a Reply