తెలంగాణా ఎన్నికల కమిషన్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. బీఎల్వోలు డిజిటలైజ్ చేసిన సమాచారం ఆధారంగా ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2కోట్ల 64 లక్షల 87వేల ఓట్లను ముసాయిదాలో పొందుపర్చారు. వీటిలో 92లక్షల మందికి నోటీసులిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. 60 లక్షల అనామలీస్తో పాటు 32 లక్షల నోమ్యాపింగ్ ఓట్లకు నోటీసులివ్వనున్నారు. నెల రోజు పాటు నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తరువాత ఓటర్ల జాబితా తుది జాబితాపై స్పష్టత వస్తుందన్నారు.
2.64 కోట్ల దరఖాస్తులు….
జూన్ 25న మొదలైన ఈ ప్రక్రియలో బీఎల్ఓలు 3.38 కోట్ల ఎన్యుమరేషన్ పత్రాలను అందించారు. అందులో తిరిగి 2.64 కోట్లకు పైగా ఫారాలు తిరిగి రావడంతో బీఎల్ఓలు వాటిని డిజిటలైజ్ చేశారు. 73లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోయాయి. ఇందులో అబ్సెంట్, షిఫ్టింగ్, డెత్, డూప్లికేట్ వంటి కారణాలతో పత్రాలు రాలేదు. వీటి మొత్తం 21.70శాతంగా ఉంది. ఇందులో చనిపోయిన వాళ్లు 9లక్షల 22వేల 229 పర్మినెంట్లీ షిఫ్టింగ్, అబ్సెంట్, ఇతరులు 57లక్షల 46వేల 803మంది ఉన్నారు. ఒకటి కంటే ఎక్కువ ఓటర్ల జాబితాలో నమోదు చేసుకున్న 6.70లక్షల మంది మందికి పైగా ఉన్నారు.అర్హత గల ఓటర్లు ఫారం 6 ద్వారా డిక్లరేషన్ ఇచ్చి తమ ఓటును పొందొచ్చని అధికారులు చెబుతున్నారు.

అఖిలపక్ష సమావేశం….
ముసాయిదా జాబితాకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు సుదర్శన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీలకు వివరించారు. నోటీసులు, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గడువు తక్కువగా ఉందని దీన్ని పెంచాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు.
వివరణ లేకుండా ఓట్లు తొలగించం….
నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఓ ఒక్క ఓటును కూడా ముసాయిదా జాబితాలో నుంచి తొలగించమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నోటీసు ఇచ్చి దర్యాప్తు చేసి సరైన కారణాలు చూపిన తర్వాతనే ఓటు తొలగింపు ఉంటుందంటున్నారు.












Leave a Reply