(హైదరాబాద్,న్యూస్ఇన్)
వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించిన సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రిని ఔట్ పేషెంట్స్ ఎవరికి పరిమితం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే.. కేసీఆర్ ప్రారంభించిన TIMS ఆసుపత్రుల ప్రారంభోత్సవాల పేరుతో ప్రచారం చేసుకుంటోందన్నారు.డేట్లు, డెడ్లైన్లు మార్చుకుంటూ పోయి, చివరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోవడం శోచనీయమని ప్రకటన విడుదల చేశారు.
కరోనా తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు TIMSలకు రూపకల్పన చేశారని,2022 ఏప్రిల్ 26న ఒకేరోజు ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి చరిత్ర సృష్టించామన్నారు.ప్రణాళిక నుంచి నిధులు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
మూడేళ్ల కాలంలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించకుండా, కేవలం ప్రచారం కోసం నేడు TIMS సనత్నగర్ను ప్రారంభిస్తున్నారు. కనీసం ఆసుపత్రికి నీటి సరఫరా కూడా కల్పించలేదు అంటే పేదల వైద్యం పట్ల వీరికి ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థం అవుతుందన్నారు.
కేసీఆర్ ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల నుంచి ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది.ప్రచారంపై ఉన్న శ్రద్ధ, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంపై ఎందుకు లేదని ప్రశ్నించారు.మూడు TIMS సహా వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ 2000 పడకల కొత్త బ్లాక్ పూర్తయితే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే పనులను ఆలస్యం చేయడం నేరపూరిత నిర్లక్ష్యం అన్నారు.












Leave a Reply