(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో 22ఎ నిషేధిత భూముల సమస్య అధికారుల తప్పిదంతోనే వచ్చిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.22 ఎపై సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు . ఈకమిటీ వారానికోసారి సమావేశమై దరఖాస్తులు ఇతర సమస్యలపై సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. నిషేధిత భూములపై సమస్యలు వస్తే… టోల్ఫ్రీ నెంబర్ 1800 5994788 ను ఏర్పాటు చేశామని ఎవరు దీనికి సమాచారం పంపినా కనీసం 3 రోజల్లో సమాధానం అందుతుందని, పరిష్కారానికి చర్యలు చేపడతారని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని కేసుల్లో ఎందుకు చేయలేమో ప్రజలకు స్పష్టమైన కారణం చెప్పాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లయితే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని ఆదేశించామన్నారు. నిషేధిత భూముల జాబితాలో చేరిన అసలైన యజమానులకు ఎటువంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.

అధికారులపై చర్యలేమి తీసుకోవాలి….
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారుల కారణంగా ఈ సమస్య వచ్చిందని వ్యాఖ్యలు చేస్తూనే తాను క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. ప్రభుత్వమే ఇరకాటంలో పడే విధంగా అధికారులు తీసుకున్న నిర్ణయంపై చర్యలు ఉంటాయా అన్న దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరే చెప్పాలని మంత్రి మీడియాను ప్రశ్నించారు. దీంతో అధికారులపై ఎలాంటి చర్యలు ఉండవని మంత్రి చెప్పకనే చెప్పినట్లచయింది. అదే విధంగా ఈ వివాదాన్ని ఆదాయంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. త్వరలో తాను అకస్మిక తనిఖీలు చేస్తానన్నారు.












Leave a Reply