NewsInn

News in a Click

కొండా సుష్మిత వ్యాఖ్య‌లు ఆమె వ్య‌క్తి గ‌తం

కొండా సుష్మిత వ్యాఖ్య‌లు ఆమె వ్య‌క్తి గ‌తం

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్)

కొండా సుష్మిత వ్యాఖ్య‌లు ఆమె వ్య‌క్తి గ‌త‌మైన‌వని మంత్రి కొండా సురేఖ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.
టిపిసిసి క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసు పై మంత్రి కొండా సురేఖ వివరణ లేఖను క్ర‌మ‌శిక్ష‌ణా కమిటి ఛైర్మన్ మల్లు రవికి పంపించారు.

ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారని లేఖలో మంత్రి తెలిపారు. తన స్వస్థలమైన గీసుకొండతో తన కూతురు సుస్మితా పటేల్ కు వున్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వివరించారు.

ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *