(న్యూస్ఇన్, హైదరాబాద్)
హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఎంపీ తనయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16వ తేదీన మాధాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి కారు ఢీ కొట్టడంతో మృతి చెందింది. ఘటనా స్థలంలోనే యువతి మృతి చెందడంతో పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా సుపత్రికి తరలించారు. ఓడిశ్శాకు చెందిన యువతి కావడంతో రాజకీయంగా చక్రం తిప్పారు. యువతి తల్లిదండ్రులను ఒడిశ్శా నుంచి హుఠా హుటిన హైదరాబాద్ ఫ్లైట్ లో రప్పించారు. యువతి పోస్టు మార్లం పూర్తి కావడంతో యుద్ధ ప్రాతిపదికన మృదేహాన్ని సొంత రాష్ట్రానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాద సంఘటన బయటకు రాకుండా ఎంపీ కొడుకు ప్రాథమికంగా విజయంతం అయినా ఆ తరువాత పరిశీలించి ఎంపీ లింగమనేని తనయుడి సంజూష్ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజుల క్రితం లింగమనేని రమేష్ ఎంపీగా జనసేన పార్టీ నేతగా రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు. తొలి రోజు రోడ్డు ప్రమాదంగానే భావించిన పోలీసులు అనంతరం విచారణ జరిగిన ఎంపీ తనయుడిపై కేసు నమోదు చేయడం జరిగింది.










Leave a Reply