తెలంగాణా యువతకు అవకాశం….!!
(న్యూస్ఇన్,హైదరాబాద్)
దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ VBYLD- 2027కు తెలంగాణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు. 15–29 ఏళ్ల మధ్య వయస్సున్న యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
మై భారత్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ అన్వేష్ చింతల మాట్లాడుతూ వికసిత్ భారత్@2047 లక్ష్యాలు చేరుకునేందుకు యువత ఆలోచనలు, ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో ఒక వేదిక కల్పించడమే VBYLD ఉద్దేశమని తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు రీజియన్-9 లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ థీమ్ లో భాగంగా ఉన్నాయి.టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఫ్యూచర్ రెడీనెస్ ప్రధాన అంశంగా యువత తమ పరిశోధనలను సమర్పించాల్సి ఉంటుంది.

కల్చరల్ ట్రాక్, డిజైన్ ఫర్ భారత్, హ్యాక్ ఫర్ సోషల్ కాజ్, యూత్ ఎంట్రప్రెన్యూర్స్ ఛాలెంజ్, యూత్ పార్లమెంట్మొ లాంటి మొత్తం ఆరు విభాగాల్లో జాతీయ స్థాయిలో పోటీలు ఉంటాయి. డిజిటల్ క్విజ్ నుంచి ప్రారంభమయ్యే ఎంపిక ప్రక్రియ వ్యాసరచన, జిల్లా స్థాయి PPT, రాష్ట్ర స్థాయి పోటీ, జాతీయ స్థాయి గ్రాండ్ ఫినాలే వరకు అర్హులైన వారిని ఎంపిక చేస్తూ తదుపరి దశకు అధికారులు అనుమతి ఇస్తారు.
ఎంపికైన విజేతలకు ప్రధానమంత్రి మోడీ సమక్షంలో తమ అభిప్రాయాలతో పాటు పరిశోధనలను ప్రదర్శించే అవంకాశం దక్కుతుంది. కల్చరల్ టీంలో మాత్రం 25 మందితో బృందాన్ని అధికారులు ఎంపిక చేయనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే కార్యక్రమాలకు ఎంపికైన వారిని తీసుకెళ్లే బాద్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.రిజిస్ట్రేషన్, క్విజ్ మై భారత్ పోర్టల్ లో ఉచితంగా నమోదు చేసుకుని ఈ పోటీల్లో పాల్గొనవచ్చని అధికారులు వెల్లడించారు.












Leave a Reply