NewsInn

News in a Click

కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలి- పీసీసీ చీఫ్

కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలి- పీసీసీ చీఫ్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నామని తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న రాజకీయ విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

ప్రతిపక్ష నేతలను గౌరవించడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిలో భాగమన్నారు. వాజ్‌పేయి, జైపాల్ రెడ్డి ఉదాహరణలను ప్రస్తావిస్తూ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రత్యర్థుల ఆరోగ్యాన్ని, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బాత్‌రూమ్‌లో జారిపడిన సమయంలో గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అరుదుగా హాజరయ్యారన్నారు.

కేసీఆర్ ఆరోగ్యంపై కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం సరికాదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇదే సమయంలో హరీష్ రావుపై కవిత చేసిన క్షుద్ర పూజల ఆరోపణలపై ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి పిండప్రదానం లాంటివి చేయ‌డం మంచిది కాద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *