అసెంబ్లీలో కీలక పరిణామం….!
(న్యూస్ఇన్,హైదరాబాద్)
శాసనసభా సమావేశాలు పూర్తయ్యే వరకు బీఆర్ ఎస్ ఎమ్మెల్యలపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత రాష్ట్ర రాజకీయలు ఒక్క సారిగా వేడెక్కాయి. అసెంబ్లీ లోపలి కంటే బయటే జరుగుతున్న పరిణామాలతో ఒక్క సారి పొలిటికల్ హాట్ హాట్ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఎత్తులతో రెండు రోజులుగా తెలంగాణా మొత్తం రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నల్ల టీషర్ట్ లతో సభలోకి అనుమతి ఇవ్వని అధికార పక్షం అక్కడ జరిగిన పరిణామాలతో డిఫెన్స్ పడింది.

కానీ వీడియో పుటేజీలు చూసి విపక్షాన్ని డిపెన్స్ లో వేసే వ్యూహాత్మకంగా పావులు కదిపింది. పోలీసులకు, విపక్ష నేతలకు మధ్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి గులాబీ పార్టీని ఆత్మరక్షణలో వేసింది. గులాబీ పార్టీ నేతలు కూడా ప్రభుత్వానికి రాజకీయంగా కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ బయట జరిగిన పరిణామాలపై గులాబీ పార్టీ నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేటిఆర్ , హరీష్ రావ్ లు సహా పలువురు నేతలపై కేసులను నమోదు చేశారు. ఎమ్మెల్సీల వ్యాఖ్యలను కాంగ్రెస్ సీరియస్ గా పరిగణించి ఇద్దరు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. శాసనమండలి సభ్యుల గురించి అసెంబ్లీలో చర్చించి వారిపై చర్యలు తీసుకునేలా తీర్మానం చేసింది.

మరోవైపు పోలీసులు కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించే యత్నం చేశారు. కాని కోర్టు రిమాండ్ చేయకపోవడంతో గులాబీ పార్టీకి ఉపశమనం లభించింది. కానీ శాసనమండలిలో ఇద్దరు సభ్యలను సస్పెన్షన్ చేస్తూ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసింది….వారిని అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కంట తడిపెట్టడం…..అసెంబ్లీ స్పీకర్ ను అవమానించారని నిరసిస్తూ..కాంగ్రెస్ నేతలు ఎర్రవల్లి ఫాం హౌస్ ముట్టిడికి పిలుపునివ్వడం కూడా ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకోవడంతో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ నుంచి అక్కడికి వెళ్లే యత్నం చేశారు. బీఆర్ ఎస్ నేతలను నగర శివారుల్లో పోలీసులు అదపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఉదయం నుంచి కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లే యత్నం చేయడంతో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు.

దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ గురించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలతో గులాబీ పార్టీ కాంగ్రెస్ పై ఎదురు దాడి మొదలు పెట్టింది. కేసీఆర్ ను చంపే కుట్రలను రేవంత్ చేస్తున్నారన్న వాదనను తెరపైకి తెచ్చింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ హై ఓల్టేజీ రాజకీయ చర్చలకు బుధవారం సర్కార్ చెక్ పెట్టింది. తొలి రోజు బీఆర్ ఎస్ సభ్యులు లేకుండానే సభ పూర్తి కాగా…రెండో రోజు ఇరు పార్టీల మధ్య సభల్లో వాడి వేడిగా చర్చ జరిగింది.
బుధవారం సభ ప్రారంభమైన తరువాత ఈ రెండు అంశాలే చర్చకు వచ్చాయి. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలతో పాటు కాంగ్రెస్ దళిత నేతలు ఇచ్చిన చావు డప్పు అంశాలను గులాబీ పార్టీ తెరపైకి తెస్తోంది













Leave a Reply