విబేధాలు సహజమే
అభిప్రాయలు వేరైనా లక్ష్యం ఒక్కటే
ఎంపీ రఘునందన్ రావ్
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
తెలంగాణా బీజెపీ ఎంపీల మధ్య విబేధాలు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది.
ప్రధాని మోడీ సూచనల అనంతరం ఎంపీలు భేటీ కావడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్పందించిన రఘునందన్ రావ్….. అరవింద్ నూతన గృహానికి ఆహ్వనిస్తే కలుసుకున్నాం….బండి సంజయ్ కి బంగ్లా వచ్చింది…..తనకు ఢిల్లీలో ఫ్లాట్ వచ్చిందని కలుసుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు బండి సాధారణ ఫ్లాట్ లో ఉండేవారని, ఇప్పుడు ఆయనకు పెద్ద బంగ్లా రావడం తప్పంటారా అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ఎంపీల తో ప్రదాని మోడీ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బిజెపీలో దూమారం రేపాయి. ఎంపీలు ఎవరి దారి వారే అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో అంతా కలిసి కట్టుగా పనిచేయాలని ప్రధాని సూచిస్తూ….బిజెపీ ఎంపీల కంటే ఎంఐఎం ఎంపీ ఎంతో ముందున్నారన్న వ్యాఖ్యలు చేయడం స్థానికంగా కూడా చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలను కొంత మంది ఎంపీలు ఖండించారు కూడా…అయితే తాజాగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావ్ ప్రధాని తమకు సూచనలు చేసిన విషయం నిజమేనన్నారు. ఓ కుటుంబ పెద్దగా తమను సరైన దారిలో నడవమని చెప్పడం తప్పుకాదన్నారు. నేతలంతా ఒకేలా ఉండడం, వ్యవహరించడం సాధ్యం కాదన్నారు. ప్రధాని సూచనలను తాము సానుకూలంగా తీసుకుంటున్నామన్నారు.తమ మధ్య అభిప్రాయ బేధాలున్నా…. రాబోయే ఎన్నికల్లో బీజెపిని రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ఒకే లక్ష్యం తమ ముందుందన్నారు.


Leave a Reply