వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేయాలంటే మరింత అదనపు భారం కొనుగోలు దారులు భరించాల్సిందే..రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహన కొనుగోలు దారులపై 2000 నుంచి 10 వేల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేప్టీ సెస్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గతంలో రోడ్ సేఫ్టీ వారోత్సవాలు ఉండేవి ఇప్పుడు రోడ్ జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. మండలిలో చర్చ సందర్భంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసుకొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రోడ్ సేఫ్టీ సెస్ కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు వర్తిస్తుందని మంత్రి చెప్పారు.

ద్విచక్ర వాహనాలకు రు. 2000
లైట్ మోటార్ వెహికల్స్ కు రు. 5000
హెవీ వెహికల్ కి రు. 10 వేలు రోడ్ సేఫ్టీ సెస్ ను ప్రభుత్వం ఖరారు చేసింది.
దేశంలో 29 రాష్ట్రాలు వాహన సారధి లో చేరితే గత ప్రభుత్వం లో తెలంగాణ మాత్రం చేరలేదని మంత్రిపొన్నం ప్రభాకర్ తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ షో రూమ్ లోనే చేసే విధంగా చేయడం జరిగింది.. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ చేసి లైసెన్స్ లు ఇచ్చే ప్రక్రియ ఢిల్లీ మాదిరి ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు.



Leave a Reply