(హైదరాబాద్,న్యూస్ఇన్)

శాసనసభ ఏకపక్షంగా నడిపిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ శాసనసభ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజుమండలి లో కూడా అదే నిర్ణయం తీసుకుంటూశాసనమండలి సభ్యులు ఈసమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.రైతుకు యూరియా అందివ్వడంలో ప్రభుత్వంవిఫలమైందని బీఆర్ ఎస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. సీజన్ లో రైతలకు సరైన సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడాన్ని బీఆర్ ఎస్ తప్పుబడుతోంది. యూరియాకు అందుబాటులో ఉందని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో రైతులు యూరియా బస్తాల కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఎదరు చూస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. షాప్ లలో లేని యూరియా యాప్ ల ద్వారా ప్రభుత్వం ఎలా అందిస్తుందని బీఆర్ ఎస్ ప్రశ్నిస్తోంది.


Leave a Reply