NewsInn

News in a Click

అతి తెలివితో బీఆర్ఎస్ అన్యాయం చేసింది

పోల‌వ‌రం- న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ను వ్య‌తిరేకిస్తున్నాం

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మంత్రి

(హైద‌రాబాద్,న్య‌స్ఇన్‌)

తెలంగాణా ఆవిర్భావం త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన బీఆర్ ఎస్ పార్టీ ప‌దేళ్ల పాటు అతి తెలివితో రాష్ట్రానికి అన్యాయం చేసింద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ‌త కొన్ని రోజులుగా న‌దీ జ‌లాల వాటాపై కాంగ్రెస్,బీఆర్ ఎస్ పార్టీలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. కృష్ణా, గోదావ‌రి జ‌లాల వినియోగంలో గ‌త‌ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానంతో తెలంగాణా రైతాంగానికి అన్యాయం జ‌రిగింద‌ని ఉత్త‌మ్ ఆరోపించారు. నిన్న హ‌రీష్‌రావ్ పీపీటీలో చూసించిన‌లేఖ వాస్త‌వంకాద‌న్నారు. పోలవరం- నల్లమల్ల సాగర్ ను మేము అన్ని వేదిక‌ల‌పై వ్య‌తిరేకిస్తున్నామ‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టును మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్నామ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. మా అభిప్రాయాల‌ను బీఆర్ ఎంబీ స‌మ‌ర్దించింద‌ని చెప్పారు. రాష్ట్రం త‌ర‌పున బ‌లంగా వాద‌న‌లు వినిపించాల‌ని సుప్రీం న్యాయ వాది అభిషేక్ సింఘ్వీని తాము కొరిన‌ట్లు మంత్రి తెలిపారు. వ‌చ్చే సోమ‌వారానికి కేసు వాయిదాప‌డింద‌ని ఆలోపు సూట్ పిటీష‌న్ వేయాల‌ని సుప్రీం కోర్టు సూచించింద‌న్నారు. మారోసారి న్యాయ వాదుల‌తో భేటీ అనంత‌రం ప్ర‌భుత్వం త‌న వ్యూహం ఖ‌రారు చేస్తుంద‌ని , వ‌చ్చే విచార‌ణ‌కు తానే స్వ‌యంగా హాజ‌ర‌వుతాన‌ని మంత్రి వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం తెలంగాణాలో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాతే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థకం ఆగింద‌ని మ‌రోసారి ఉత్త‌మ్ స్ప‌ష్టం చేశారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హాయంలో ఆగిఉంటే ఎందుకు చెప్ప‌లేద‌ని ప్ర‌శ్నించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *