NewsInn

News in a Click

తెలంగాణా స‌చివాల‌యంలో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్

తెలంగాణా స‌చివాల‌యంలో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్

మంత్రి ది ఓ మాట‌….ముఖ్య‌మంత్రిది మ‌రో నిర్ణ‌యం

టికెట్ల ధ‌ర‌ల పెంపు జీఓల వెనుక అదృష్య శ‌క్తి

గ‌వ‌ర్న‌ర్ విచార‌ణ జ‌రిపించాలి

మాజీ మంత్రి హ‌రీష్ రావ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో ఇప్పుడు థియేట‌ర్ల కంటే స‌చివాల‌యంలోనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాలు విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఎద్దేవా చేశారు. జ‌రుగుతున్న ప‌రిణామాలు ప‌రిశీలిస్తుంటే రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా లేదా అనే అనుమానాలు క‌లుగుతున్నాయ‌న్నారు. ప్ర‌భుత్వం ఎవ‌రి క‌నుస‌న్నల్లో న‌డుస్తుందో అంతు చిక్క‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పాల‌న‌లో ప్ర‌భుత్వం చేతులెత్తేసింద‌ని విమ‌ర్శించారు.


ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒక‌రిదైతే పెత్త‌నం మ‌రొక‌ర‌దిగా న‌డుస్తుండ‌డం హాస్యాస్ప‌దంగా ఉంన్నారు. సాక్షాత్తు సంబంధిత శాఖా మంత్రికి తెలియ‌కుండా సినిమాల టికెట్ల ధ‌ర‌ల పెంపుకు అనుమ‌తి ఇచ్చే జీఓ విడుద‌ల కావ‌డం శోచ‌నీయంగా ఉంద‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం న‌డిపిస్తున్నారా…..స‌ర్క‌స్ కంపెనీ న‌డిపిస్తు్నారా తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చుర‌క‌లు అంటించారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయంని వ్యాఖ్య‌లు చేశారు.
అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలను సీఎం అమ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టిన సీఎం….. ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా విడుద‌ల చేస్తున్నార‌ని హ‌రీష్ రావ్ ప్ర‌శ్నించారు. . అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారాని నిల‌దీశారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారుసంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరని ప్ర‌శ్నించారు.ప్రభుత్వం సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తుందా….? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకుందా అంతు చిక్క‌ని వ్య‌వ‌హారంగా మారుతోంద‌న్నారు.ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు..

ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇవ్వ‌డంలో అంత‌ర్యమేమిట‌న్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. ప్ర‌భుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదు.సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు.

ఇది ప్రజా పాలన కాదు.. . పాపిష్టి పాలన కు పరాకాష్ట

మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం.ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *