NewsInn

News in a Click

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం (డిసెంబర్ 30 – జనవరి 8)

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ముఖ్యాంశాలు

దర్శన తేదీలు: డిసెంబర్ 30, 2025 నుండి జనవరి 8, 2026 వరకు.

మొదటి 3 రోజులు
(డిసెంబర్ 30, 31, జనవరి 1):

టోకెన్ల జారీ: ఎలక్ట్రానిక్ డిప్ (ఆన్‌లైన్) ద్వారా మాత్రమే సర్వ దర్శనం టోకెన్లు కేటాయిస్తారు.

డిప్ రిజిస్ట్రేషన్: నవంబర్ 27 (ఉదయం 10) నుండి డిసెంబర్ 1 (సాయంత్రం 5) వరకు.

రిజిస్ట్రేషన్ పద్ధతులు: టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, లేదా వాట్సాప్ బాట్
(9552300009 – Govinda/Hi అని మెసేజ్ చేయండి).రద్దు: ఈ మూడు రోజులు SED, శ్రీవాణి, ఇతర ప్రత్యేక దర్శనాలు, వీఐపీ సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు రద్దు.తరువాత 7 రోజులు
(జనవరి 2 – జనవరి 8 వరకు)

సర్వ దర్శనం: టోకెన్లు లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనం కల్పిస్తారు.

SED, శ్రీవాణి: జనవరి 2 నుండి 8వ తేదీ వరకు రోజుకు 15,000 SED (₹300) టికెట్లు మరియు 1,000 శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు.

విడుదల తేదీ: డిసెంబర్ 5, 2025.

స్థానికులకు దర్శనం:
జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, తిరుమల స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా రోజుకు 5,000 టోకెన్లు కేటాయిస్తారు.
(డిసెంబర్ 10న ఆన్‌లైన్‌లో విడుదల).

ముఖ్య గమనికలు:

తిరుపతిలో SSD టోకెన్లు: డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేయబడింది.

ప్రత్యేక దర్శనాలు రద్దు: చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ మొదలైన ప్రత్యేక దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేయబడ్డాయి.

వీఐపీ దర్శనం: స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *