NewsInn

News in a Click

ప‌నికి మాలిన వాళ్ల‌కు స‌మాధానం నేను చెప్పాలా…!

ప‌నికి మాలిన వాళ్ల‌కు స‌మాధానం నేను చెప్పాలా…!

ఇద్ద‌రు ప‌నికి మానికి వాళ్లే

బీఆర్ఎస్, కాంగ్రెస్ పై మంత్రి కిష‌న్ రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

సింగ‌రేణి బొగ్గు గ‌నుల విష‌యంలో చెల‌రేగిన దూమారం అన్ని రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారింది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఈ వ్య‌వ‌హారంలోకి లాగ‌డంతో కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప‌నికి మాలిన వాళ్లు ప్ర‌శ్నిస్తే…..వాటికి నేను స‌మాధానాలు చెప్పాలా అని మీడియాను ప్ర‌శ్నించారు. ఇరు పార్టీల కార‌ణంగా సింగ‌రేణి సంస్థ న‌ష్టాల ఊబిలో కూరుకుపోయింద‌న్నారు. సింగ‌రేణి బొగ్గు గ‌నుల పై కేంద్ర ప్ర‌భుత్వం ఆజ‌మాయిషీ ఎప్పుడూ లేద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు అనుగుణంగా సంస్థ కార్య‌క‌లాపాలు జ‌రుగుతాయ‌ని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ‌ల మంత్రి కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. నైనీ బొగ్గు టెండ‌ర్ల విష‌యంలో వివాదం రాజుకోవ‌డంతో ఆయ‌న స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు బుర‌ద జ‌ల్లుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని ఆరోపించారు.

గ‌తంలో లేని నిబంధ‌న‌ను ప్ర‌స్తుతం విధించింది నిజ‌మేన‌ని కిష‌న్ రెడ్డి అంగీక‌రించారు. సైట్ విజిట్ నిబంధ‌న కార‌ణంగా ఇప్ప‌టికి 17 సంస్థ‌లు నైనీ బొగ్గు గ‌నుల‌ను సందర్శించాయ‌ని చెప్పారు.టెండర్లలో సాధారణంగా ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ సెల్ఫ్ డిక్లరేషన్ రూపంలో ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. 17 కంపెనీలు విజిట్ చేసినా ఒక్కరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదన్నారు.సింగ‌రేణి సిఎస్ ఆర్ నిధుల‌తో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు విచ్చ‌ల విడిగా సొంతానికి వినియోగించుకున్నార‌ని ఆరోపించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 74 శాతం బొగ్గు ఆధారంగానే వస్తోంది. అంత పారదర్శకంగా, సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ వేలం నిర్వహిస్తోందన్నారు.రాష్ట్ర ప్ర‌భుత్వం నైనీ బ్లాక్ టెండ‌ర్ల లో మేము వేలం వేయ‌లేమ‌ని తెలిపితే మేము పారద‌ర్శ‌కంగా టెండ‌ర్లు వేస్తామ‌ని కిష‌న్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *