(హైదరాబాద్,న్యూస్ఇన్)

కొత్త సంవత్సరం సందర్బంగా మధ్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కోర్టు జైలు శిక్ష విధించింది. పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన 270 మందికి జైలు శిక్షలు విధిస్తూ పలు కోర్టులు తీర్పులు వెలువరించాయిన్యూ ఇయర్స్ సందర్భంగా 2025 డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించారు. ఇలా పట్టుబడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిందితుల వివరాలు వారి కార్యాలయాలకు ట్రాఫిక్ అధికారులు పంపిస్తున్నారు. మధ్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం కావడంతో వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల అధికారులను కోరుతూ లేఖలు కూడా జత చేస్తూన్నారు. రానున్న రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.




Leave a Reply