సిట్ విచారణ అనంతరం కేటిఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రుల ఫోన్లు, తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. పోలీసులు ట్యాపింగ్ విషయంలో లీకులు ఇస్తూ ….. మీడియాలో వార్తలు వచ్చే విధంగా చూస్తున్నంశాన్ని పోలీసుల ముందు ప్రస్తావించనని కేటిఆర్ వ్యాఖ్యానించారు. మీడియా సంస్థలు కూడా లీకులను పరిగణలోకి తీసుకుని వార్తలు ఇవ్వరాదని కేటిఆర్ కోరారు. సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటిఆర్ విచారణ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించడంతో కేటిఆర్ ఆ సమయానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యేందుకు తన నివాసం నుంచి తెలంగాణా భవన్ కు చేరుకున్నారు.

పార్టీ నేతలు పెద్ద ఎత్తున తెలంగాణా భవన్ కు చేరుకుని కేటిఆర్ కు మద్దతుగా నిలిచారు. విచారణ పూర్తయ్యే వరకు కేటిఆర్ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంతో పాటు తెలంగాణా భవన్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. సుమారు ఏడన్నర గంటల పాటు సిట్ విచారణ అనంతరం కేటిఆర్ బయటకు రావడంతో గులాబీ నేతలు ఎంతో ఉత్సాహంగా కేటిఆర్ కు స్వాగతం పలికారు. జూబ్టీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి తెలంగాణా భవన్ కు చేరుకున్న కేటిఆర్ నేతలతో కలిసి విచారణ జరిగిన తీరును నేతలకు వివరించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన కేటిఆర్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. నన్ను విచారణకు ఎందుకు పిలిచారో అర్ధం కాలేదని వ్యాఖ్యానించారు. పోలీసులు అడిగిందే అడుగతూ మరో కథ అల్లే యత్నం చేస్తున్నారనిపించింది. ఇలాంటి కేసులు, విచారణ గురించి భయపడే పరిస్తితి లేదన్నారు. మేము భయపడే వాళ్లమైతే కోర్టుకు వెళ్లి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించే వాళ్లమన్నారు. హరీష్ రావ్ సిద్దిపేటలో ఉంటే పోలీసులు నోటీసులు ఇచ్చారని, తాను సిరిసిల్లలో ఉన్న సమయంలో పోలీసులు తమ ఇళ్లకు వచ్చి నోటీసులు అందించరన్నారు. పోలీసుల విచారణ రేవంత్ రెడ్డిని మెప్పించే విధంగా సాగుతుందని వ్యాఖ్యానించారు.






Leave a Reply