NewsInn

News in a Click

హీందీ ప్ర‌చార్ స‌భ భ‌వ‌నంలో భారీ అగ్ని ప్ర‌మాదం

హీందీ ప్ర‌చార్ స‌భ భ‌వ‌నంలో భారీ అగ్ని ప్ర‌మాదం

ప్ర‌మాదంలో చిక్కుకున్న మూడు కుటుంబాలు

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్)

న‌గ‌రం న‌డిబొడ్డున భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. నాంప‌ల్లి లో హిందీ ప్ర‌చార్ స‌భ పేరుతో భ‌వ‌నంలో ఉన్న భ‌వానంలోని ఫ‌ర్నీచర్ షాప్ లో మంట‌లు అంటుకుని భారీగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంలో ఆ భ‌వ‌నంలోనే నివ‌సించే మూడు కుటుంబాల‌కు చెందిన ఆరు గురు వ్య‌క్తులు మంట‌ల్లో చిక్కుకున్నారు. సాయంత్రం వేళ‌ల్లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డంతో ఆ ప్రాంతం పొగ‌తో ఉక్కిరి భిక్క‌రి చేసింది. నిత్యం ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశం కావ‌డంతో అక్క‌డికి ఫైర్ ఇంజ‌న్లు చేరుకోవ‌డం, స‌హాయక చ‌ర్య‌లు తీసుకోవ‌డం కూడా ఇబ్బంది క‌రంగా మారింది. గ‌త కొన్ని రోజులుగా వాచ్ మెన్ కుటుంబ స‌భ్యులు సెల్లార్ లో ఉంటున్నారు.

ఇక్క‌డ ఉంటున్న ఈ వాచ్ మెన్ కుటుంబంలో ఇద్ద‌రు చిన్నారులు అఖిల్ (11). ప్రణీత్ (7) లతో పాటు మ‌రో న‌లుగురు అగ్ని ప్ర‌మాదంలో చిక్కుకున్నారని గుర్తించారు. వారి కోసం అగ్నిమాప‌క సిబ్బంది రెస్క్యూ ఆపరేష‌న్ పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఉన్న భ‌వ‌నంలో అగ్రి ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో నుమాయిష్ జ‌రుగుతుండ‌డంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు.

వివాదంలో ఉన్నభ‌వ‌నం….

ఈ భ‌వ‌నం దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మాణం జ‌రిగినా… భ‌వ‌నం చుట్టూ వివాదాలు ఉన్నాయి. 1960 లోనే హిందీ ప్రచార సభ పేరుతో దాత‌ల స‌హ‌కారంతో నిర్మాణం చేశారు. అచ్యుత్ రెడ్డి అనే వ్య‌క్తి ఈ భ‌వ‌న నిర్మాణం కోసం భూమిని ఇచ్చారు. కొంత కాలంగా అ్ర‌మార్కులు భ‌వ‌నంపై ఆధిప‌త్యం న‌డిపిస్తుండ‌డంతో కోర్టు దాకా ఈ వ్య‌వ‌హారం వెళ్లింది. భ‌వ‌నంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఫ‌ర్నీచ‌ర్ దుక‌ణాల‌ను ఏర్పాటు చేసుకున్నారు. దుకాణాల‌ను ఖాళీ చ ఏయాల‌ని హై కోర్టు ఆదేశించినా…కోర్టు ఆదేశాల‌ను భేఖాత‌ర్ చేస్తూ య‌ధావిధిగా దుకాణ దారులు త‌మ వ్యాపారాల‌ను కొన‌సాగిస్తున్నారు. దుకాణ‌దారుల ఆక్ర‌మ‌ణ‌ల‌తో సెట్ బ్యాక్ కూడా లేకుండా పోయింది.

చ‌ర్య‌లు తీసుకుంటాము….

ప్ర‌మాద ప్రాంతాన్ని ఫైర్ డీజీ విక్రంసింగ్ మాన్ సంద‌ర్శించారు. భ‌వ‌నంలో రెండు సెల్లార్ లు ఉన్న‌ట్లు గుర్తించామ‌ని చెప్పారు. మొద‌టి సెల్లార్ లో డంప్ యార్డులో వేస్ట్ ఫ‌ర్నీచర్ ఉంచ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌త‌కు కార‌ణ‌మైంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ ప‌నిచేసే కార్మికులు రెండో సెల్లార్ లో ఉంటార‌ని వారు అగ్ని ప్ర‌మాదంలో చిక్కుకున్నార‌ని తెలిపారు. ప్ర‌మాదానికి షార్ట్ స‌ర్క్య‌ట్ కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించామ‌న్నారు. ఆరు గంట‌ల శ్ర‌మించిన త‌రువాత మంట‌లు అదుపులోకి వ‌చ్చాయని,భ‌వ‌న య‌జ‌మానిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డీజీ ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *