(హైదరాబాద్,న్యూస్ఇన్)

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పెంచింది. వరుసగా బీఆర్ ఎస్ కీలక నేతలను విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తోంది. హరీష్ రావ్, కేటిఆర్ లను విచారించిన సిట్ తాజాగా మాజీ ఎంపీ బీఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ రావ్ కు నోటీసులు జారీ చేసింది. 160 CRPC కింద నోటీస్ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కు సంబంధించిన విచారణ లో భాగంగా విచారణకు పిలుస్తున్నట్టు నోటీస్ లో పేర్కొన్నారు.సిట్ నోటీసుపై స్పందించిన మాజి ఎంపి సంతోష్ రావు స్పందిస్తూ…..రేపటి విచారణకు హాజరై పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పారు. సంతోష్ రాజ్యసభ పదవీకాలం ముగిసి పోయినా సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో పార్లమెంట్ సభ్యులు సంతోష్ రావ్ పేర్కొనడం విశేషం.





Leave a Reply