దేవనపల్లి కవిత
(హైదరాబాద్,న్యూస్ఇన్)

తెలంగణాలో ఉద్యమకారులకు, అమరవీరులకు బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ దూరం కావడానికి మాజీ ఎంపీ సంతోష్ రావే కారణమని తెలంగణా జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ దేవనపల్లి కవిత ఆరోపించారు. నిరంతరం కేసిఆర్ తో ఉండే ఆయనే గుంపు మేస్త్రీకి ప్రధాన గూఢాచారి అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ వంటి నేతలను కూడా గేట్ల ముందు గంటల తరబడి నిలబెట్టిందుకు కారణమేఆయన అన్నారు. కేసిఆర్ ఫాం హౌస్ లో సగం ఇడ్లీ తిన్నారా….పూర్తి ఇడ్లీ తిన్నారా అనే సమచారాన్ని కూడా ఆయనే సీఎం కు చేరవేస్తున్నారని కవిత ఆరోపించారు.ట్యాపింగ్ కేసుల్లో ఆయనను కూడా విచారణకు పిలివడం ఒక డ్రామాగానే తాను భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీలో ఉన్న సమయంలో నేను చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం సంతోష్ రావ్ అనే మాజీ ఎంపీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా సిట్ నిజాయితీగా పనిచేస్తే ఇలాంటి దుర్మార్గులకు శిక్ష తప్పకుండా పడుతుందన్నారు.

ఉద్యమకారులను కేసిఆర్ కు దూరం చేసిన పాపం సంతోషకు తగులుతుందని కవిత శాపనార్ధలు పెట్టారు. అంతకు ముందు గంజాయి మాఫియా దాడికి గురైన మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను నిమ్స్ లో కవిత పరామర్శించారు. సౌమ్య కుటుంబాని అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో గృహ హింస పెరిగేందుకు డ్రగ్స్, గంజాయి కూడా కారణమని కవిత ఆరోపించారు. ప్రభుత్వం మత్తు ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





Leave a Reply