NewsInn

News in a Click

ప్రేమ‌-పెళ్లి కి త‌ల్లి దండ్రుల‌ను లేపేసిన యువ‌తి

ప్రేమ‌-పెళ్లి కి త‌ల్లి దండ్రుల‌ను లేపేసిన యువ‌తి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

వికారాబాద్ జిల్లాలో విస్తుబోయే సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ నెల 24 వ‌తేదీ భార్య‌, భ‌ర్త‌లు మృతి చెంద‌డంతో అప్పుల బాధ భ‌రించ‌లేక ఆ ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కేసు విచారించిన పోలీసుల‌కు మైండ్ బ్లాక్ అయ్యే విష‌యం వెలుగు చూసింది. క‌న్న కూతురే త‌ల్లిదండ్ర‌ల‌ను హ‌త మ‌ర్చింద‌న్న వాస్త‌వం బ‌య‌ట‌కు వ‌చ్చింది.బంట్వారం మండలం యాచారం గ్రామంలో దశరథ్, లక్ష్మి హత్య కేసులో వాని కూతురు సురేఖ నిందితురాలిగా తేలింది.

సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌య‌మైన ప్రియుడు….

సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో న‌ర్సుగా ప‌నిచేసే సురేఖ‌కు ఇన్స్టాగ్రాం ద్వారా ఏడాదిక్రితం ఓ యువ‌కుడితో స్నేహం అయింది. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌కు దారి తీసింది. తన ప్రేమ విష‌యాన్ని త‌ల్లిదండ్ర‌ల‌కు తెలియ‌చేసి ఆ యువ‌కుడిని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌డంతో ఆ యువ‌తి త‌ల్లి దండ్రులు అందుకు అంగీక‌రించ‌లేదు. అప్ప‌టి నుంచి త‌ల్లి దండ్రుల‌ను ఎలాగైనా ఒప్పించే ప్ర‌య‌త్నాల‌కు బ‌దులు తొల‌గించే య‌త్నాల‌ను ఆ యువ‌తి మొద‌లు పెట్టింది. ఆసుప్ర‌తిలో ప‌నిచేస్తుండ‌డంతో ఆ ఆసుప‌త్రి నుంచే మ‌త్తు ఇంజ‌క్ష‌న్ల‌ను ఆ యువ‌తి దొంగిలించింది. మ‌త్తు ఇంజెక్ష‌న్ల మోతాదుకు మించి ఇస్తే మృతి చెందుతార‌ని వైద్యుల ద్వారా తెలుసుకున్న ఆమె అందుకు అనుగుణంగా త‌న ప్లాన్ అమ‌లు చేసింది. ఈ నెల 24 న త‌ల్లి ఒళ్లు నొప్ప‌ల‌ని కూతురుకు చెప్ప‌డంతో ఇంజ‌క్ష‌న్ వేస్తే త‌గ్గిపోతుంద‌ని న‌మ్మించి అధిక డోస్ లో ఇంజ‌క్ష‌న్ ఇవ్వ‌డంతో త‌ల్లి మృతి చెందింది.అమ్మ ఒళ్లు నొప్పుల‌ని ప‌డుకుంద‌ని న‌మ్మించి…. తండ్రికి మాయ మాట‌లు చెప్పి అదే రోజు రాత్రి అత్య‌ధికంగా మ‌త్తు డోస్ ఇంజ‌క్ష‌న్ డోస్ ఇచ్చింది. స‌హ‌జ మ‌ర‌ణాలుగా చిత్రీక‌రించేందుకు త‌ప్పుడు స‌మాచారాన్ని త‌న అన్న‌కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చింది.

పోలీసుల విచార‌ణ‌లో విస్తు గొలిపే నిజం…..

గ్రామంలో మాత్రం అప్పుల బాధ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌న్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. అనుమానంతో చేసిన ఫిర్యాదులో పోలీసులు కేసు విచార‌ణ‌ను చేప‌ట్టి వాస్త‌వాల‌ను వెల్ల‌డించారు. తాను ప్రేమించిన యువ‌కుడిని పెళ్లి చేసుకునేందుకు సురేఖ అనే యువ‌తి త‌ల్లి దండ్రుల‌నే హ‌త్య చేసింద‌ని పోలీసులు తేల్చారు. వారి ఇంటి నుంచి మ‌త్తు మందు ఇచ్చేందుకు వినియోగించిన ఇంజ‌క్ష‌న్ల‌తో పాటు మ‌త్తు మందు వాయిల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డిలో ఆ యువ‌తి ప‌నిచేసే ఆస‌ప్ర‌తికి వెళ్లి ఆ మ‌త్తు మందు బ్యాచ్ వివ‌రాలు సేక‌రించి ఆసుప‌త్రి నుంచి మ‌త్తు మందును దొంగిలించి త‌ల్లి దండ్ర‌ల‌పై ప్ర‌యోగించింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. త‌ల్లి దండ్రుల‌ను వారి కూతురు హ‌త్య చేసింద‌న్న విష‌యం స‌రిస‌ర గ్రామాల్లో దావానంలో వ్యాపించ‌డంతో యువ‌తి తీరుపైతీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ఘ‌ట‌న‌లో యువ‌తి ప్రియుడికి ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని పోలీసు విచార‌ణ‌లో తేలింది. పోల‌సులు సురేఖ‌ను రిమాండ్ కు త‌ర‌లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *