(హైదరాబాద్, న్యూస్ఇన్ )
అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తొలి రోజు పరిచయ కార్యక్రమాలతో పాటు 21వ శతాబ్దంలో నాయకత్వం అనే కోర్సులో భాగంగా “అధికార విశ్లేషణ.. నాయకత్వం” అంశంతో తొలి సెషన్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమవుతున్న తరగతులకు సీఎం హాజరు అవుతున్నారు. ఇందులో కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. మరోవైపు బోస్టన్ ప్రాంతమంతా తీవ్ర శీతాకాల అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ మంచు తుఫాను (ఫెర్న్) కారణంగా రెండు అడుగులకుపైగా (సుమారు 24 ఇంచులు) మంచు కురిసినట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్కి దిగువకు పడిపోయాయి.

ఖాళీ సమయంలో సీఎం తన బ్యాచ్ మెంట్ తో వివిధ అంశాలపై చర్చలు జరుపుతున్నారు. మరో రెండు రోజుల్లో సీఎం తరగతులు పూర్తికానున్నాయి.




Leave a Reply