బీఆర్ఎస్ సీరియస్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విచారణలో సిట్ దూకుడు పెంచడంతో రాజకీయాలు కూడా వెడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ ఎస్ పార్టీ కీలక నేతలకు మాత్రమే నోటీసులు ఇచ్చి విచారణ జరిపిన సిట్ తాజాగా మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ కు నోటీసులు ఇచ్చింది. 30వ తేదీన విచారణ చేస్తామనినోటీసుల్లోతెలిపింది. నందినగర్ నివాసం దగ్గర నోటీసులు అందచేసిన సిట్ విచారణ కోసం పోలీసులు ఎక్కడికి రమ్మన్నా….అక్కడికే వచ్చి విచారణచేస్తారని నోటీసుల్లో పేర్కొంది.

సిట్ నోటీసులు ఇవ్వడంతో గులాబీ నేతలు ప్రభుత్వం పై ఘాటుగా స్పందిస్తున్నారు. పదేళ్ల కేసిఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికోసం తమ అధినేత కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు, నోటీసుల ఇచ్చేందుకు పోటీ పడుతుందనిఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం తాము ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి దిశలో నడిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక , కుంభకోణాలకు తెరలేపుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

సింగరేణి కుంభ కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్ దీన్ని జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న హిల్ట్ పాలసీలో కూడా కుంభకోణం ఉందని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. తాజాగా ఎక్సైజ్ లో మైక్రోబ్రూవరీల కేటాయింపులో కుంభ కోణంజరుగుతోందని గులాబీ పార్టీ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సమయంలోనే జరుగతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా సిట్ పోలీసులు ట్యాపింగ్ కేసులో కీలక నేతల విచారణ మొదలు పెట్టారని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

సిట్ నోటీసులను నిరసిస్తూ…బీఆర్ ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి…. సీఎం దిష్టి బొమ్మలను దగ్దం చేస్తున్నాయి.అయితే సిట్ నోటీసులపై మాజీ సీఎం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 30వ తేదీనేవిచారణ చేస్తామని పోలీసులు తెలియచేయడంతో విచారణను వాయిదా వేయమని కోరుతారా….విచారణకు రావాలని సిట్ అధికారులకు సమాచారం ఇస్తారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ నోటీసులపై ఎలా వ్యవహారించాలన్నదానిపై పార్టీ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.






Leave a Reply