NewsInn

News in a Click

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంపై సుప్రీం సీరియ‌స్

మూడు వారాలు కేసు వాయిదా

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌)

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై అన‌ర్మ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ ఎస్ వేసిన పిటీష‌న్ సుప్రీం కోర్టులో హాట్ హాట్ చ‌ర్చ‌కు దారి తీసింది. గ‌త కొన్ని నెల‌లుగా జ‌రుగుతున్నీ ఈ కేసు విచార‌ణ‌లో సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. స్పీక‌ర్ అనుస‌రిస్తున్న వైఖ‌రిని బీఆర్ఎస్ త‌ర‌పున వాద‌న‌లు వినిపిస్తున్న లాయ‌ర్ త‌ప్పు బ‌ట్టారు. పార్టీ మారిన‌ట్లు ఆధారాలున్నా నిర్ణ‌యం తీసుకోవ‌డంలో జాప్యం చేస్తున్నార‌ని కోర్టుకు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటీష‌న్ల‌పై వాద‌న‌లు వినిపిస్తున్న అభిషేక్ మ‌నుసంఘ్వీ ఈ కేసులో మ‌రో మూడు వారాల గ‌డువు ఇవ్వాల‌ని కోరారు. ఈ స‌మ‌యంలోనే సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. స్పీక‌ర్ సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ…. స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోక‌పోతే సుప్రీం కోర్టు ధిక్క‌ర‌ణ‌గా భావించాల్సి ఉంటుందని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *