NewsInn

News in a Click

శ్రీశైలంలో చేతులెత్తేసిన అధికారులు

నియంత్ర‌ణ కోల్పోయిన పోలీసులు- భ‌క్తుల‌పై లాఠీ చార్జ్

(శ్రీశైలం,న్యూస్ఇన్‌)

మ‌హాశివరాత్రి ఉత్స‌వాల సంద‌ర్భం భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేశామ‌ని గొప్ప‌లు చెప్పుకున్న ఆల‌య అధికారులు శివ‌రాత్రికి నాలుగైదు రోజుల ముందే చేతు లెత్తేశారు. ఉత్స‌వాల్లో కీల‌క ఘ‌ట్టానికి ముందే ముందే అధికారుల వైఫ‌ల్యం ప‌రిపాల‌న ప‌రంగా బయ‌ట‌ప‌డింది. పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్న శివ‌భ‌క్తుల‌కు త‌గిన ఏర్పాట్లు చేయ‌లేక‌, ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు బారులు తీర‌డం నిర్వ‌హ‌ణా లోపంతో శ్రీశైలంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది.ఉద‌యం నుంచి లైన్లో ఉంటున్న సాయంత్రం వ‌ర‌కు ద‌ర్శ‌నాలు కావ‌డం లేద‌ని శివ‌స్వాములు వాపోయారు.మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో దేవ‌స్థానం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. గ‌త కొన్నేళ్లుగా తాము వ‌రుస‌గా శివ‌రాత్రి సంద‌ర్భంగా శ్రీశైలం వ‌స్తున్నా ఇలాంటి ప‌రిస్థితులు ఎప్పుడు త‌లెత్త‌లేద‌న్నారు.

ఇ.ఓ. వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కార‌ణంగానే స‌మ‌స్య‌లు తలెత్తాయ‌ని శివ‌భ‌క్తులు ఆరోపిస్తున్నారు.భ‌క్తుల‌కు సరైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ఇఓ తీరుపై శివ‌స్వాములు నిరస‌న వ్య‌క్తం చేశారు. ద‌ర్శ‌నం కోసం వేచి చూసిన శివ‌స్వాములు ఒక్క సారిగా దేవాల‌యం క్యూలైన్ లోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో పోలీసులు శివ‌భ‌క్తుల‌పై లాఠీ చార్జ్ చేశారు.ఏఏస్పీ యుగంధ‌ర్ బాబు అత్యుత్సాహం చూపి స్వ‌యంగా లాఠీ ఝుళిపించ‌డంతో పోలీసుల‌కు త‌మ లాఠీల‌కు ప‌నిచెప్పారు. కృష్ణ‌దేవరాయ గొపురం ద‌గ్గ‌ర ర‌ద్దీని నియంత్రించేందుకు వ‌చ్చిన ఏ ఏస్పీ తానే నియంత్ర‌ణ కోల్పోయి వ్య‌వ‌హ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *