(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
టీ-20 లో ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్ల చేతిలో చిత్తయింది. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో ఓటమి చవి చూసింది. పసికూన ఐర్లాండ్ కూడా 2-0 తేడాతో భారత్ పై సీరీస్ గెలుచుకుని ఛాంపియన్లకు చుక్కలు చూపింది. అనంతరం ఇంగ్లాండ్ పర్యటనకువెళ్లిన జట్టుకు ఊహించని విధంగా చుక్కెదురైంది. ఒక్క మ్యాచ్ లో కూడా ఇంగ్లాడ్ జట్టుకు ధీటైన సమాధానం ఇవ్వలేకపోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 5-0 తో ఓడిపోవాల్సిన సీరిస్ ను 4-0 కు మారింది. ఈ రెండు సీరీస్ లకు ముందు నుంచి ఎంతో ఆసక్తి రేపి ఎన్నో ప్రయోగాలు చేసిన భారత క్రికెట్ బోర్డు ప్రయోగాలు రెండు సీరీస్ లలో పూర్తిగా విఫలం అయ్యాయి.

జట్టులో ఏ ఒక్కరి స్థానానికి గ్యారెంటీ లేకపోవడం…ఏ మ్యాచ్ లో ఎవరిని ఆడించాలన్న స్పష్టత లేకపోవడం….మ్యాచ్,మ్యాచ్ కు కొత్త ప్రయోగాన్ని అమలు చేయడం వంటి అంశాలు జట్టును తీవ్రంగా దెబ్బతీశారు. ఈ ఆరు మ్యాచ్ లలో భారత బ్యాటర్లతో పాటు బౌలింగ్ విభాగం కూడా పూర్తిగా విఫలమైంది. స్వదేశంలో చిచ్చర పిడుగుల్లా రెచ్చి పోయే క్రికెటర్లు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పిచ్ లపై చేతులెత్తాశారు. బ్యాటర్లు అలా వెళ్లి ఇలా తిరిగి వచ్చేందుకు బ్యాటర్లు పోటీ పడ్డారు. ఇక బౌలర్లు కూడా ఎవరు ఎక్కువగా పరుగులు ఇస్తారు….తక్కువగా వికెట్లు తీసుకుంటారన్న దానికి పోటీ పడ్డట్లు కనిపించింది. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్ బౌలర్లు కూడా ఏ మ్యాచ్ లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు.ఇక సమిష్టిగా చేసే ఫీల్డింగ్ కూడా ఛాంపియన్ల మాదిరిగా ఏ మ్యాచ్ లో కూడా కనిపించలేదు. క్యాచ్ లు జార విడవడం ఒక్క పరుగు ఇచ్చే దగ్గర రెండు పరుగులు సమర్పించుకున్నారు.
ఇలా అన్ని రంగాల్లో కూడా భారత జట్టు విఫలం కావడంతో పసి కూన లాంటి జట్టు చేతితో పాటు బలమైన ఇంగ్లాండ్ కు ఎక్కడా పోటీ ఇవ్వకుండా పోయింది. త్వరలో మొదలయ్యే వన్డే సీరీస్ నాటికి అపజయాలను వీడి కొత్తగా ఆట మొదలు పెడుతారా వన్డే సీరీస్ కూడా సమర్పించుకుంటారా అన్నది ఆసక్తి రేపుతోంది. భారత జట్టు ఓటమికి టీ-20 ఐపీఎల్ మ్యాచ్ లు కూడా కారణమన్న ఆరోపణలు మొదలయ్యాయి. భారత దేశంలో బ్యాటింగ్ కు సరిపోయే పిచ్ లపై విశ్వరూపం ప్రదర్శించే బ్యాటర్లు…విదేశీ పిచ్ లపై చేతులెత్తేయడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.














Leave a Reply