(అమరావతి,న్యూస్ఇన్)
ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణుల సూచనల మేరకు ముంబాయి ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్ కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
పదేళ్ళగా నొప్పి భరిస్తూ…
పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకుని శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇటీవల సైనస్ కు పవన్ కళ్యాణ్ ఆపరేషన్ చేయించుకున్నారు. తాజాగా ఆపరేషన్ పూర్తి కావడంతో మరి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.











Leave a Reply