NewsInn

News in a Click

ఎన్నికల సిబ్బంది పై పిచ్చికుక్కల దాడి

(హైదరాబాద్, న్యూస్ఇన్)

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వింత ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు కనీసం రెండు నెలల ముందు నుంచి చర్యలు తీసుకుంటారు. కూలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలను స్థానిక అధికారులు శుభ్రం చేసి ఒకటి రెండు రోజులు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తారు. అయితే పోలింగ్ అధికారులు మాత్రం ముందుగానే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్లిన అధికారులకు కరీంనగర్ లో భయంకరమైన అనుభవం ఎదురైంది. విధి నిర్వహణకు వచ్చిన సిబ్బందిపై అక్కడే ఉన్న పిచ్చి కుక్కలు ఒక్కసారిగా మీద పడి దాడి చేశాయి.

ఈ కుక్కల దాడిలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన ముగ్గురు అధికారులు గాయపడ్డారు. గాయపడినవారికి ప్రాథమిక చికిత్స చేయించి.. వ్యాక్సిన్‌ ఇప్పించి ఇంటి దగ్గర దింపినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల విధి నిర్వహణ కోసం వచ్చిన అధికారులపై పిచ్చికుక్కలు దాడి చేయడం కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *