
బీఆర్ ఎస్ నేతల పై ఫైర్
(మెదక్,న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకున్న ఘటనపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై సీఐ ఈడ్చుకొచ్చి, కొట్టినందుకు నా పార్టీ నేతగా, నా అనుచరుడిగా కాపాడుకోవాల్సిన బాథ్యత తనపై ఉందని అందుకోసమే ఆ పోలింగ్ స్టేషన్ కువెళ్లానని జగ్గారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా సీఎం వ్యవహరించి మా నాయకుడిని అవమానించారన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రం దగ్గర సీఐ కావాలని సమస్య సృష్టించారన్నారు. ఇది పోలీసు ఉన్నాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా….తమ పార్టీ నేతలను ఆ పోలీసు అధికారి బహిరంగగా అవమానపర్చడాన్ని తాను తప్పుబట్టినట్లు పేర్కొన్నారు. పోలిందగ్ కేంద్రం దగ్గర నిబంధనలు అంతా పాటించాల్సిందేనని పోలీసు అధికారులైనా, నే నైనా ఒక్కటే అన్నారు. నిబందనలు ఉల్లఘించిన వారిపై చట్టరీత్యాచర్యలు తీసుకోవడాన్ని నేను అభ్యంతరం చెప్పడం లేదన్నారు.
పోలింగ్ రోజు సాయంత్రమే ఈ ఘటనను తాను వదిలేశానన్నారు.

బీఆర్ఎస్ నేతలపై ఫైర్….
ఈ సంఘటనని కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో.. జగ్గారెడ్డి అధికారుల మీద దాడి చేస్తున్నారని పదే పదే ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో మీరు వ్యవహరించిన తీరు కూడా సోషల్ మీడియాలో ఇంకా ఉన్నాయని వాటిని నేను కూడా ప్రచారం చేయాలా అని ప్రశ్నించారు. పోలీసు అధికారులను ఉద్దేశించి హరీష్ రావ్ ఏ మాట్లాడారు, కేటిఆర్ మట్లాడిన విషయాలను కూడా వారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ రోజుల్లోనే పోలీసు అధికారులను ఆ ఇద్దరు నేతలు దుర్భాషలాడడం పోలీసు అధికారులు ఎప్పుడూ విస్మరించరన్నారు. ఆ బూతు పురాణంపై కేటిఆర్, హరీష్ రావులు ముందుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ ఎస్ సోషల్ మీడియా ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెట్టి పోలీసు అధికారులకు, పోలీసు వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలన్నారు.


Leave a Reply