కేటిఆర్ చెప్పిన కొన్ని గంటల్లోనే
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికల అనంతరం మరో కీలక ఘట్టానికి అనుమతి దక్కింది. గత ప్రభుత్వ హాయంలో ఈ కార్ రేస్ నిర్వహణలో అవినీతి చోటు చేసుకుందని ప్రస్తుత ప్రభుత్వం విచారణ నిర్వహిస్తుంది. ఈ విచారణలో భాగంగా గతంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటిఆర్ ను పలు మార్లు ఏసీబీ అధికారులు విచారించారు. అదే సమయంలో పట్టణాభివృద్ధి శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది.

ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ కేసులోనే కేటిఆర్ ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ కొన్ని రోజుల క్రితమే అనుమతి ఇచ్చారు. దీంతో ఈ ఫార్ములా కార్ రేస్ అంశం మరోసారి రాజకీయంగా హాట్ హాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం కేటిఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సమయంలోనే ఈ ఫార్ములా కార్ రేస్ లో మరోసారి విచారణకు పిలుస్తారన్న సమచారం తనకు అందిందని చెప్పారు. ఆ తరువాత కొద్ది గంటల్లోనే సీనియర్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నాలుగు సార్లు విచారణను ఎదుర్కొన్నానని మరెన్ని సార్లు విచారణకు పిలిచినా వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని కేటిఆర్ అన్నారు. కేసులో అరెస్టు చేసినా భయపడేది లేదని కేటిఆర్ వ్యాఖ్యలు చేశారు.





Leave a Reply