- అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి

(హైదరాబాద్,న్యూస్ఇన్)
కల్తీ టీ పొడీ ఘటన మరువక ముందు నగరంలో కల్తీ పాల రాకెట్ వెలుగు చూసింది. నగర శివారుల్లోని కడ్తాల్ మండలంలోని రావిచెడ్ గ్రామంలో పాలు సేకరించే శ్రీశైలం గౌడ్ లాభసాటి వ్యాపారంగా దీన్ని మార్చుకోవాలనుకున్నారు.పాల సేకరణతో పాటే కల్తీ పాలు తయారు చేయడం మొదలు పెట్టారు. కల్తీ పాలను తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ కల్తీ పాలతో ప్రజల ప్రాణలతో చెలగాటం మొదలు పెట్టారు. కొన్ని రోజుల పాటు గుట్టుగా సాగిన ఈ వ్యాపారం గురించి బయటకు పొక్కడంతో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు నకిలీ పాలను తయారుచేసే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. పాల సరఫరా కోసంవినియోగించే ఆటోను సీజ్ చేశారు. అప్పటికే తయారు చేసి సిద్ధంగా ఉంచిన పాలను పోలీసులు పరీక్షల కోసం ల్యాబరెటరీకి పంపించారు.
కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్…..

నగరంలోని ఖైరతా బాద్ ప్రాంతంలో కల్తీ అల్లం,వెల్లుల్లి తయారు చేసి విక్రయించే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 4000 వేల కిలోల కల్తీ పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. జేజే ఫుడ్స్ పేరుతో కల్తీ పేస్ట్ తయారు చేసి నగరంలో ఈ ముఠా గత కొన్ని రోజులుగా వ్యాపారం చేస్తోంది. హోటళ్లు, కిరాణ షాపులకు తక్కువ ధరకు విక్రయిస్తుండడంతో పెద్ద ఎత్తున ఈ ముఠా మార్కెటింగ్ చేస్తూ లాభాలు గడించింది. ముఠా లో కీలక వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ పేస్ట్ తయరీకి వినియోగించే గ్రైండింగ్ మెషీన్లు, రసాయనాలు, 1000 కేజీల ఉప్పు సీజ్..సరఫరాకు వినియోగించిన అశోక్ లేలాండ్ గూడ్స్ ఆటో స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కల్తీ టీ పొడి కూడా….


Leave a Reply