
ఫైనల్ మెరిసిన అభిషేక్
మూడోసారి సంజు హాఫ్ సెంచరీ
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ ఇన్)
ఐసీసీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్, లీగ్ దశల్లో నిరాష పరిచిన అభిషేక్ ఫైనల్ లో ఓ మెరుపు మెరిశారు. కీలక మ్యాచ్ లో అభిషేక్ తన ఇన్నింగ్స్ తో భారత్ భారీ స్కోరు సాధించేందుకు అనుగుణంగా బ్యాటింగ్ లో బాటర్లు సత్తా చాటుతున్నారు. తొలిసార ఇండియన్ ఓపెనర్లు ఈ మ్యాచ్ లో తొలి సారి మొదటి వికెట్ కు శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లు పవర్ ప్లేలోనే న్యూజీలాండ్ బౌలర్ల పై విధ్వంసం సృష్టించారు. 7.1 వర్లలో 98 పరుగులు సాధించారు. అక్కడ తొలి వికెట్ రూపంలో అభిషేక్ శర్మ ఔటయ్యారు ఆలోపే న్యూజీలాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించారు.21 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 52 పరుగులు సాధించారు. 6 ఫోర్లు, 3 సిక్స్ ల సహాయంతో చేశారు.

అభిషేక్ ఇన్నింగ్స్ కు పోటీగా సంజు శాంసన్ మరోసారి ఫైనల్ లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అభిషేక్ ఔటయిన తరువాత ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కు వచ్చి అభిషేక్ బాటనే అనుసరించారు. న్యూజీలాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ పరుగులు రాబట్టడంలో సక్సెస్ అయ్యారు.
సంజు, ఇషాన్ 30 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 13 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ జట్టు ఒక్క వికట్ నష్టానికి 167 పరుగులు చేసింది. ఫోర్లు, సిక్స్ లతో అహ్మదాబాద్ లో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నారు. 15 వ ఓవర్లు పూర్తయ్యే సరికి 203 స్కోరు వద్ద సంజు శాసన్46 పరుగుల్లో 89 పరుగులు చేసి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యారు 15.1 ఓవర్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.ఫైనల్స్ లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులను భారత్ చేసింది. హర్దిక్ పాండ్య ఫాంలో ఉండడంతో సంజు స్థానంలో హార్ధిక్ బరిలో దిగారు.

భారత్ ను దెబ్బతీసిన 16వ ఓవర్ …..
16 వ ఓవర్ భారత్ కు షాక్ గురి చేసింది. నూజీలాండ్ బౌలర్ నీషమ్ బౌలింగ్ లో సంజు శాసంన్ ఔటైన వెంటనే ఇషాన్ కిషన్ వెనుదిరిగారు. ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన కెప్టన్ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే పెవిలియన్ చేరుకున్నారు. దీంతో 16 వ ఓవర్ భారత బ్యాటర్లకు ఇబ్బందులు పడ్డారు.. భారత్ స్కోరు వేంగం ఒక్క సారిగా తగ్గిపోయింది. 10 బంతుల్లో ఒక్ బౌండరీని కూడా భారత్ బ్యాటర్లు సాధించలేకపోయారు. 15 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో భారత్ స్కోరు బోర్డుకు నెమ్మదించింది. 300 పరుగుల వరకు భారత్ స్కోరు వెళ్లే అవకాశం ఉందని అంతా అంచనా వేసినా…. ఒక్క ఓవర్ భారత్ ను భారీగా దెబ్బతీసింది. 18 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోరు 220 పరుగులు మాత్రమే చేగలిగింది. 16వ ఓవర్ నుంచి భారత్ స్కోరు స్లో అయింది. 19వ ఓవర్లో మొదటి బంతి కి హార్ధిక్ సిక్స్ బాది స్కోరు వేగం పెంచే ప్రయత్నం మొదలు పెట్టారు.ఆ తరువాతి బంతికే హార్దిక్ 13 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యారు.

దుబే 8 బంతుల్లో 24 పరుగులు….
హార్దిక్ స్థానంలో శివం దుబె ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చారు. 19వ ఓవర్ పూర్తయ్యే వరకు భారత్ స్కోరు 231 పరుగులకు చేరుకుంది. చివరి ఓవర్ మరోసారి జెమీ నిషమ్ కు ఫోర్ తో దుబే స్వాగతం పలికారు. ఆ తరువాత వరుసగా రెండు సిక్స్ లు కొట్టారు. 4వ బంతికి నాలుగు పరుగులు సాధించారు.5 బంతి డాట్ బాల్ గా పడింది ఒక్ పరుగు తీసే అవకాశం ఉన్నా…దుబే పరుగు తీసేందుకు ఆసక్తి చూపలేదు. దుబే 8 బంతుల్లో 26 పరుగులు సాధించారు. చివరి బంతికి మరో ఫోర్ కొట్టడంతో నీషమ్ చివరి ఓవర్లో భారత్ 24 పరుగులు చేయగలిగింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.
గ్యాలరీలో అమీత్ షా…..
భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ వీక్షించేందుకు కేంద్ర మంత్రి అమీత్ షా స్టేడియంకు వచ్చారు స్టేడియం నుంచి ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ ను ఆయన వీక్షించారు.

Leave a Reply