
- మంత్రి పొంగులేటీ కీలక వ్యాఖ్యలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూధాన్ భూముల్లో నిర్మాణం చేసిన ఇళ్లను కూల్చి వేసిన ప్రభుత్వం కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. ఇది పేదల ప్రభుత్వమని పేదలకు అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిర్వాసితుల్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి ఇస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నారు. దాదాపు 800 ఇళ్లను ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సర్కార్ కూల్చి వేయడంతో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. దీంతో పాటు ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెలుగు మట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్లకుంట్ల కవిత నిరాహార దీక్ష మొదలు పెట్టారు. ప్రభుత్వం ఇళ్లను కూల్చి వేసిన తరువాత బాధితులకు అండగా ఉంటామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్న అభిప్రాయం విపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు.
నాకు క్రషర్ నడిపే ఓపిక లేదు….
“ORR పక్కన సంబంధం లేని క్రషర్ నాదని పిచ్చి కుక్కలు చాలా మొరుగుతున్నాయి, నాపై మొరిగే కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో నాకు తెలుసు.. ఆ క్వారీ నాదని చిల్లర ఆరోపణలు చేస్తున్నారు, నాకు క్రషర్ నడిపే ఓపిక లేదు..అది నా క్రషర్ కాదుబీఆర్ఎస్ నేతలు చెబుతున్నది తిరుమల క్రషర్, వేస్ట్ క్రష్ చేసి సప్లై చేసే లైసెన్స్ వారికి ఉంది.. ఆ క్రషర్ కంపెనీ మా కంటైనర్ తీసుకువెళ్ళింది..దాని పై ఉన్న పేరును తొలగించినట్లు ఉన్నారు.. దానిని పట్టుకుని పిచ్చి వాగుడు వాగుతున్నారు.. నా పై పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెబుతాను” అంటూ బిఆర్ఎస్ నాయకుల విమర్శలపై తీవ్రంగా స్పందించారు.
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరవిధక దీక్ష

Leave a Reply