NewsInn

News in a Click

టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ లో ఇషాన్-సంజుల పోటా పోటీ..!

  • భార‌త్ విజ‌యం లో ఇద్ద‌రూ కీల‌కం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

టీ=20 ప్ర‌పంచ‌క‌ప్ మొద‌లైన నాటి నుంచి భార‌త జ‌ట్టులో ఇషాన్ కిష‌న్, సంజు శాంస‌న్ లు ఇద్ద‌రు త‌మ స్థానం ఏమిటో త‌మ‌కే తెలియ‌ని ప‌రిస్థితుల్లో భార‌త జ‌ట్టులో స్థానం ద‌క్కించుకున్నారు.లీగ్ ద‌శ‌లో అభిషేక్ తో క‌లిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన ఇషాన్ కిష‌న్ బ్యాటింగ్ లైనప్ లో ఆ త‌రువాతి మ్యాచ్ నుంచి మారింది. ఈ ఇద్ద‌రు బ్యాటింగ్ చేసే స్థానాలు మారి పోయాయి. సంజు ఓపెనర్ గా అవ‌కాశం ద‌క్కింది. ఇషాన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వ‌చ్చారు. గ్రూప్, లీగ్ ద‌శ‌ల్లో భార‌త ఓపెన‌ర్లు ఏ మ్యాచ్ లో అనుకున్న స్థాయిలో రాణించ‌లేక‌పోయారు. ప‌వ‌ర్ ప్లే పూర్త‌య్యే లోపే భారత్ జ‌ట్టు ఓపెన‌ర్ల వికెట్లను కోల్పోతూ వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి స్టార్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ శ‌ర్మ గ్రూప్ ద‌శ‌లో ఒక్క ప‌రుగు కూడా మొద‌లు పెట్ట‌క‌ముందే పెవిలీయ‌న్ చేరుకున్నారు. ఈ ప‌రిస్థితుల్లో మ‌రో ఎండ్ లో ఉన్న ఇషాన్ కిష‌న్ జ‌ట్టు స్కోరు పెంచే బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ విజ‌య‌వంతం అయ్యారు. ద‌క్షిణాఫ్రికా, వెస్టీండీస్ తో మ్యాచ్ లు మిన‌హా అన్ని మ్యాచ్ లో రాణించారు. న‌మీబీయా తో 61 (24), పాకిస్తాన్ 77(40), జింబాబ్వే 38 (24), ఇంగ్లాండ్ 39(18), ఫైన‌ల్ లో న్యూజీలాండ్ తో 54 (25) మొత్తం 36 ఫోర్లు, 18 సిక్స్ లు ప్ర‌పంచ క‌ప్ ఇషాన్ కొట్టారు. మూడు హాఫ్ సెంచ‌రీల‌తో మొత్తం 317 ప‌రుగులు చేశారు.

రెండేళ్ల త‌రువాత జ‌ట్టులోకి….

భార‌త జ‌ట్టులోకి ఇషాన్ కిష‌న్ రెండేళ్ల త‌రువాత ఎంట్రీ ఇచ్చారు. విరామం కోర‌డంతో భార‌త జ‌ట్టు యాజ‌మాన్యం కిష‌న్ ను జ‌ట్టు ఎంపిక జాబితాలో పేరు చేర్చ‌లేదు. తిరిగి జ‌ట్టులో చేరేందుకు దేశ‌వాళి క్రికెట్లో మ‌రోసారి త‌న ఆట‌ను మెరుగు ప‌ర్చాల్సి వ‌చ్చింది. దేశ‌వాళి క్రికెట్లో రాణించ‌డంతో ప్ర‌పంచక‌ప్ లో ఆడే అవ‌కాశం ద‌క్కించుకున్నారు. రెండేళ్లు దూరంగా ఉన్న స‌మ‌యంలో మానసికంగా ఎంతో ఇబ్బందులు ప‌డ్డా గ‌తాన్ని, భ‌విష్య‌త్తు గురించి ఆలోచించ‌డం మానేశాన‌ని ఇషాన్ కిష‌న్ అన్నారు.

ఇక సంజు శాంస‌న్ కు గ్రూప్ ద‌శ‌లో న‌మీబియా పై 22(8), సూప‌ర్ 8 లీగ్ ద‌శ‌లో జింబాబ్వే తో 24 (15) తో వెస్టీండీస్ తో జ‌రిగిన మ్యాచ్ నుంచి సంజు ఇన్నింగ్స్ గేర్ మార్చారు. 27 (50), సెమీఫైన‌ల్స్ లో ఇంగ్లాండ్ తో 89 (42) ఫైన‌ల్స్ లో న్యూజీలాండ్ తో 89 (46) ప‌రుగులు చేశారు. చివ‌రి మూడు ఇన్నింగ్స్ లో లో సంజు కీల‌క స‌మ‌యాల్లో భారీ ఇన్నింగ్స్ ఆడి బార‌త్ విజ‌యంలో కీ రోల్ ప్లే చేశారు. ఐదు ఇన్నింగ్స్ లో మొత్తం సంజు 321 ప‌రుగులు చేశారు. ఈ ఇద్ద‌రి స్కోరకు కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే తేడా ఉంది.

టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు బ్యాటింగ్ లో రాణించ‌డం భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్ లో బాగా క‌లిసి వ‌చ్చింది. భారీ స్కోర్లు సాధించేందుకు దోహ‌ద‌ప‌డింది. త‌ద్వారా ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌పై వ‌త్తిడి పెంచ‌గ‌ల‌డంలో ఈ ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లుగా మారారు.

ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే భారీ స్కోర్ సాధించినా సెమీఫైన‌ల్స్ లో ఇంగ్లాండ్ భార‌త జ‌ట్టుపై దాదాపు గెలుస్తుంద‌న్న వ‌ర‌కు వ‌చ్చింది. కానీ ఫేస్ ద‌ళ‌ప‌తి జ‌స్ప్రీత్ బూమ్రా ఒక్క ఓవ‌ర్ ఇంగ్లాండ్ ను రేస్ నుంచి వెనక్కి నెట్టింది. చివ‌రి మూడో ఓవ‌ర్ల‌లో 45 ప‌రుగుల ల‌క్ష్యాన్న ఇంగ్లాండ్ విజ‌యం కోసం చేరుకోవాల్సి ఉంది. 18వ ఓవ‌ర్ బూమ్రా వేయ‌డంతో ఇంగ్లాండ్ కేవ‌లం ఆరు ప‌ర‌గులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో మిగిలిన ఓవ‌ర్ల‌లో భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్న ఇంగ్లాండ్ చేరుకోలేక‌పోయింది. ఈ మ్యాచ్ లో బూమ్రా బౌలింగ్, ఫీల్డింగ్ లో అక్ష‌ర్ పటేల్ అద్భుత‌మైన క్యాచ్ ల‌తో ఇంగ్లాండ్ ఓట‌మి ఖ‌రారైంది. ఇక ఫైనల్ మ్యాచ్ లో బూమ్రా బౌలింగ్ ను న్యూజీలాండ్ బ్యాట‌ర్లు ఏ ద‌శ‌లోనూ ఎదుర్కొని నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతం కాలేదు. ఫైన‌ల్స్ లో 4 వికెట్లు తీసుకుని భార‌త్ కు సునాయ‌స విజాయాన్ని అందించ‌డంతో బూమ్రా దే కీల‌క పాత్ర‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *