
(తిరుమల, న్యూస్ఇన్)
టీటీడీ మరో కీలక నిర్ణయానికి ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లు మరియు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం (SED) టిక్కెట్లు కలిగి ఉన్న భక్తులు వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని తిరుమల, TTD స్పష్టం చేసింది.సోమవారం నుండి ఈ నియమాన్ని TTD కఠినంగా అమలు చేస్తోంది. వారి నిర్ణీత సమయం కంటే ముందుగా లేదా తరువాత వచ్చే భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించరాదనే నిర్ణయం తీసుకుంది. తిరుమల టోకెన్లు, రూ. 300 టికెట్లు తీసుకునే భక్తులకు కూడా నిర్ణీత సమయానికి మాత్రమే క్యూ లైన్లకు చేరుకోవాలని సూచించింది. తద్వారా యాత్రికులందరికీ సజావుగా,సౌకర్యవంతంగా దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఏపీ నుంచి ‘కామాఖ్య’ కు అమృత్ భారత్ ట్రైన్

Leave a Reply