- సోషల్ మీడియాలో కౌన్సిలింగ్ వైరల్
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో ఒక సామాజిక వర్గం సంఖ్యా బలంతో మరోసామాజిక వర్గాన్ని గతంలో కించపరుస్తూ వేధిస్తూ….. జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇరాన్ – అమెరికా యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. సంభాల్ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు డిఎస్సీ ఓ వర్గం వారితో సమావేశమై కౌన్సిలింగ్ చేస్తూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు ఇరాన్ కు విమానాలు వెళ్తున్నాయని ఇరాన్ , ఖమైనీ మద్దతు దారులుంటే అందులో వెళ్లి యుద్ధం తరువాత తిరిగి రావచ్చన్నారు. నమాజ్ సందర్భంగా, ర్యాలీ లు నిర్వహిస్తాం…నిరసన చేస్తాం….నినాదాలు దేశాన్ని, వర్గాన్ని కించపరుస్తూ నినాదాలు తమకు కూడా ఎలా వ్యవహరించాలో తెలుసున్నారు. ఇలాంటి కార్యక్రమాలను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు. ముందుగా మనం భారతీయులం అని గుర్తించుకోవాలని సూచించారు. మనకు సంబంధం లేని రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి మీకు ఏమిటి సంబంధం అని ప్రశ్నిస్తూనే….. యుద్ధం చేసుకుంటున్న దేశాలు చూసుకుంటాయన్నారు. ఇంకా అత్యవసరమైతే భారత దేశ ప్రభుత్వం చూసుకుంటుందని కానీ ఇక్కడ డ్రామాలు వేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరికలు చేశారు.
శాంతి భద్రతల సమస్యల సృష్టిస్తామంటే….సహించేది లేదన్నారు. సోషల్ మీడియాలో రీల్ కోసం దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేయడం కూడా నేరమేనన్నారు. ఒక్కరిద్దరు రెచ్చగొట్టినా వారిని గుర్తించి మీరే అడ్డుకోవాలని పోలీసు అధికారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కరి కారణంగా అంతా ఇబ్బందులు పడవద్దని సూచించారు. సంభాల్ పరిస్థితులు మీకు అంతా తెలుసన్నారు. వారి పరిస్థితి వారు చూసుకుంటారు. ఇతర దేశాల్లో జరుగుతున్న సంఘటనలు మనకు సంబంధం లేదన్నారు.బంగ్లాదేశ్ లో అలా జరిగింది, ఇరాన్ లో ఇలా జరుగుతుందంటే ఇస్లామిక్ దేశాలు చూసుకుంటాయని, అవి మీకు సంబంధం లేదని చెప్పారు. ఈ అధికారి చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.










Leave a Reply