సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నేను పూర్తిగా మారి పోయాను,…గతంలో ఉన్న దూకుడు తగ్గించుకున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తరువాత సీఎం మట్లాడారు. మూసీ పరివాహక ప్రాంతాలైన హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిదులు, మేదావులు, పర్యావరణ వేత్తలకు ఈ సమావేశానికి ఆహ్వానించారు.

మూసీ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను మూసీ కార్పోరేషన్ ఇచ్చింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై మాట్లాడారు. నిర్వాసితులపై తాను ఎంతో సానుకూలత ఉందన్నారు. వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందన్నారు. కొంత మంది ప్రజల్లో ఆందోళనలు సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాన్ని వద్దని కొంత మంది అడ్డు పడుతున్నారని ఆరోపించారు. అడ్డు పడతున్న వారికి తాత్కలికంగా తాను మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తానని, అక్కడే మూడు నెలలు ఉండగలరా అంటూ సవాల్ విసిరారు. మూసీ పూర్తిగా కాలుష్య కోరల్లో నిండి పోయిందని, ఈ ప్రభావం నల్గొండ జిల్లా ప్రజలపై పడుతుందన్నారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వారికి పెళ్లిళ్లు కావడం లేదన్నారు. మూసా. ఈసా నదుల సంగమం దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. మూసీలో గోదావరి జలాలను నిత్యం ప్రవహించే విధంగా 20 టీఎంసీల నీటిని కేటాయించి కాలుష్యం లేని నీటితో కళకళలాడేలా చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయన్నారు. ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తుందని చెప్పారు.








Leave a Reply